పొగాకు, మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
రైతు సమస్యలపై ఫోకస్ పెంచింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Mango : ఎండాకాలం వచ్చిందంటే మామిడిపండ్లు ప్రతి ఒక్కరి నోరు ఊరిస్తుంటారు. ఈ సీజన్లో మామిడి పండ్లను రుచి చూడడం కోసం ప్రజలు ఏడాదంతా ఎదురుచూస్తున్నారు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి.
Pakistan: పాకిస్థాన్లో కూల్ డ్రింక్స్కు కూడా మతం ఉంది. దాహం తీర్చే పానీయాలు ఇస్లాం ఆధిపత్య రూపానికి అనుగుణంగా లేకుంటే తీవ్రవాద ఇస్లామిక్ ఛాందసవాదుల నుండి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటాయి.
Telangana Exports: వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. గడచిన రెండేళ్లలో వ్యవసాయ ఎగుమతులు దాదాపు 40 శాతం పెరిగాయి. 2020-21లో 6 వేల 337 కోట్ల రూపాయలుగా నమోదైన ఈ ఎక్స్పోర్ట్ల విలువ.. 2021-22లో 10 వేల కోట్లు దాటడం విశేషం.
Mango : వేసవి వచ్చిందంటే చాలు మార్కెట్లో మామిడి పళ్ల విక్రయాలు మొదలయ్యాయి. మామిడిని ఇష్టపడని వారు ఉండరు. మామిడి పండ్లను తినే సమయంలో సాధారణంగా ప్రజలు తొక్కను పనికి రాని చెత్తగా విసిరి పారేస్తుంటారు.