Water Deficiency : శరీరంలో నీటి శాతం పెంచే పండ్లు, కూరగాయలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ వేడిని తట్టుకోవాలంటే మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతోపాటు కొన్ని రకాల పండ్లు తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడితో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ లోపాన్ని తీర్చకపోతే డీహైడ్రేషన్ సంభవించవచ్చు.
READ MORE: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
కానీ వేడి కారణంగానే కాదు, విరేచనాలు, వాంతులు, జ్వరం మొదలైన వాటి వల్ల కూడా శరీరంలో నీటి లోపం సంభవించవచ్చు. శరీరంలో నీటి లోపం వల్ల నీటితోపాటు మినరల్స్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం లోపాన్ని భర్తీ చేయడానికి పండిన అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం మంచిది. వేసవిలో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వేసవిలో నిమ్మరసం పుష్కలంగా దొరుకుతుంది. చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. నిమ్మ రంసంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ ఉన్న పండ్లను తింటే రోజంతా ఫ్రెస్ గా ఉంటారు. కాని నిమ్మరసంలో ఎక్కువ చక్కెరను జోడించవద్దు. నిమ్మకాయల్లో 88 శాతం నీరు ఉంటుంది.
వేసవిలో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిలో కాస్త ఉపశమనం పొందాలంటే ఈ పండును తినవచ్చు. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. పుచ్చకాయలో 90శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. మామిడి.. పండ్లలో రారాజు. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఫైబర్, సోడియం, 20 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. ఈ పండు తినడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలో 88 శాతం నీరు ఉంటుంది. కూరగాయల్లో టామాటా, దోసకాయ ఎక్కువగా తినాలి. టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి, క్రోమియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఫైటోకెమికల్స్ ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి.
దోసకాయ డీహైడ్రేషన్ను నివారించడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?