Water Deficiency : శరీరంలో నీటి శాతం పెంచే పండ్లు, కూరగాయలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ వేడిని తట్టుకోవాలంటే మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతోపాటు కొన్ని రకాల పండ్లు తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడితో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ లోపాన్ని తీర్చకపోతే డీహైడ్రేషన్ సంభవించవచ్చు.
READ MORE: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కానీ వేడి కారణంగానే కాదు, విరేచనాలు, వాంతులు, జ్వరం మొదలైన వాటి వల్ల కూడా శరీరంలో నీటి లోపం సంభవించవచ్చు. శరీరంలో నీటి లోపం వల్ల నీటితోపాటు మినరల్స్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం లోపాన్ని భర్తీ చేయడానికి పండిన అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం మంచిది. వేసవిలో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వేసవిలో నిమ్మరసం పుష్కలంగా దొరుకుతుంది. చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. నిమ్మ రంసంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ ఉన్న పండ్లను తింటే రోజంతా ఫ్రెస్ గా ఉంటారు. కాని నిమ్మరసంలో ఎక్కువ చక్కెరను జోడించవద్దు. నిమ్మకాయల్లో 88 శాతం నీరు ఉంటుంది.
వేసవిలో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిలో కాస్త ఉపశమనం పొందాలంటే ఈ పండును తినవచ్చు. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. పుచ్చకాయలో 90శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. మామిడి.. పండ్లలో రారాజు. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఫైబర్, సోడియం, 20 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. ఈ పండు తినడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలో 88 శాతం నీరు ఉంటుంది. కూరగాయల్లో టామాటా, దోసకాయ ఎక్కువగా తినాలి. టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి, క్రోమియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఫైటోకెమికల్స్ ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి.
దోసకాయ డీహైడ్రేషన్ను నివారించడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!