Water Deficiency : శరీరంలో నీటి శాతం పెంచే పండ్లు, కూరగాయలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి వచ్చిందంటే కచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. దీనితోపాటుగా కొన్ని రకాల పండ్లు తినాలి. అలా చేస్తే మీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ వేడిని తట్టుకోవాలంటే మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతోపాటు కొన్ని రకాల పండ్లు తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. అలా చేస్తే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ వేడితో అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ లోపాన్ని తీర్చకపోతే డీహైడ్రేషన్ సంభవించవచ్చు.
READ MORE: CM YS Jagan: జనంలోకి సీఎం జగన్.. రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
కానీ వేడి కారణంగానే కాదు, విరేచనాలు, వాంతులు, జ్వరం మొదలైన వాటి వల్ల కూడా శరీరంలో నీటి లోపం సంభవించవచ్చు. శరీరంలో నీటి లోపం వల్ల నీటితోపాటు మినరల్స్ లోపానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం లోపాన్ని భర్తీ చేయడానికి పండిన అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం మంచిది. వేసవిలో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వేసవిలో నిమ్మరసం పుష్కలంగా దొరుకుతుంది. చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. నిమ్మ రంసంలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ ఉన్న పండ్లను తింటే రోజంతా ఫ్రెస్ గా ఉంటారు. కాని నిమ్మరసంలో ఎక్కువ చక్కెరను జోడించవద్దు. నిమ్మకాయల్లో 88 శాతం నీరు ఉంటుంది.
వేసవిలో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిలో కాస్త ఉపశమనం పొందాలంటే ఈ పండును తినవచ్చు. ఇది శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. పుచ్చకాయలో 90శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్, మెగ్నీషియం కూడా ఉన్నాయి. మామిడి.. పండ్లలో రారాజు. ఈ పండులో విటమిన్ ఎ, సి, ఫైబర్, సోడియం, 20 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. ఈ పండు తినడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిలో 88 శాతం నీరు ఉంటుంది. కూరగాయల్లో టామాటా, దోసకాయ ఎక్కువగా తినాలి. టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సి, క్రోమియం, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, ఫైటోకెమికల్స్ ప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి.
దోసకాయ డీహైడ్రేషన్ను నివారించడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!