ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో తాను మాట్లాడినట్లు తెలిపాడు. ఆయన రెండో కుమారుడు అజయ్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు. Read Also: గ్రీన్ ఇండియా…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మళ్లీ రచ్చ మొదలైంది. మా ఎన్నికలు జరిగి నెలరోజులు దాటినా.. కొత్త ప్యానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్గం నటీనటులు ఆరోపిస్తున్నారు. మా కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా మూసిఉంటోందని.. దాంతో తాము నిరాశగా వెనుతిరగాల్సి…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి. విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఎట్టకేలకు విష్ణు మంచు అండ్…
‘మా’ ఎన్నికల వివాదం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అతనిపై రౌడీ షీట్ తో పాటు హత్య కేసు కూడా ఉందని, ముగ్గురు ఎస్ఐలను కొట్టాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఈ నెల 14వ తేదీన ఈ విషయంపై ఎన్నికల…
‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు బృందం ప్రమాణ స్వీకారం చేసి ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ గెలిచిందని ప్రకటించిన మరుసటి రోజే రాజీనామాల పర్వం మొదలైంది.…
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఆయన కుటుంబం, ప్యానల్ తో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలోనే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తానని అన్నారు. ఇరు రాష్టాల సీఎం లను సినిమా ఇబ్బందిలపై కలుస్తాము అని చెప్పుకొచ్చారు. ఇక ‘మా’లో జరుగుతున్న వివాదం గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిలదీస్తే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుంది.…
‘మా’ ఎన్నికల వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎన్నికల సమయంలో తమపై దౌర్జన్యం చేశారని, దాడి చేశారని ఆరోపిస్తూ ‘మా’ ఎన్నికలపై కోర్టుకు వెళ్తామని, అయితే అంతకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తామని కోరుతూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. అయితే కృష్ణమోహన్ మాత్రం దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఎవరు పడితే వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించలేమని అన్నట్లు ప్రకాష్ రాజ్…
‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా దీనికి నిదర్శనం. చిరంజీవి తనను ‘మా’ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగమని అడిగారంటూ విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఈ…
‘మా’ కొత్త అధ్యక్షుడు విష్ణు మంచు, అతని ప్యానెల్ సోమవారం ఉదయం తిరుమలను సందర్శించి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. విఐపి దర్శనం సమయంలో విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన సోదరి లక్ష్మి మంచుతో పాటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుతం వివాదాస్పదమైన సీసీటీవీ ఫుటేజ్ గురించి స్పందించారు. Read Also : “అలయ్ బలయ్”లో నేను, పవన్ మాట్లాడుకున్నాము : మంచు విష్ణు…
‘మా’లో వివాదం ఇంకా వాడివేడిగా సాగుతూనే ఉంది. అందరినీ కలుపుకుపోతామని చెబుతూ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇటీవలే ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అందరూ భావిస్తున్నారు. నిన్న జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో కూడా మంచు, విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోకపోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ఆ విషయంపై…