‘మా’ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్
‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు బృందం ప్రమాణ స్వీకారం చేసి ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ గెలిచిందని ప్రకటించిన మరుసటి రోజే రాజీనామాల పర్వం మొదలైంది. ప్రకాష్ రాజ్ తో సహా ఆయన ప్యానల్ సభ్యులు, ఆయనకు సపోర్ట్ చేసిన నాగబాబు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ‘మా’ ఎన్నికలలో దౌర్జన్యం చోటు చేసుకుందని కొత్త నాటకానికి తెర తీశారు. ఎన్నికల సమయంలో సీసీటీవీ ఫుటేజ్ చూశాక కోర్టుకు వెళ్తామని అన్నారు. మంచు విష్ణు బృందం తిరుమల సందర్శనలో ఉండగానే ఇక్కడ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ ను చూశారు. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ వచ్చింది.
Read Also : భారీ రేటుకు అమ్ముడైన “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
‘మా’ ఎన్నికల సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారంటూ ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. రౌడీ షీట్ ఉన్న బయటి వ్యక్తులు ‘మా’ ఓటర్లను బెదిరించారంటూ ఆరోపించారు ప్రకాష్ రాజ్. తన ఫిర్యాదులో కౌంటింట్ హాల్లో నూకల సాంబశివరావు అనే రౌడీ షీటర్ ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో సాంబశివరావుపై రౌడీ షీట్ ఉందని, ఓ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడని, గతంలో ముగ్గురు ఎస్సై లను కొట్టినట్లుగా ప్రకాష్ రాజ్ చెబుతున్నారు. 14వ తేదీని ఎన్నికల అధికారికి ఈ విషయంపై ఫిర్యాదు చేసిన ఫలితం లేదని అన్నారు ప్రకాష్ రాజ్. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో