ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. మిగతా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని స్వచ్ఛమైన ప్రేమకథ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను…
మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపా దడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమౌతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకెళుతోన్న మీనాక్షి చౌదరి.. 2018 మిస్ ఇండియా పోటీల్లో…
‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో నటిస్తున్న రెండవ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టోరీ అందించిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. దేవకీ నందన వాసుదేవ…
Couple Friendly: సంతోష్ శోభన్ ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పని లేదు. 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాని తరువాత వరుస సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో “కపుల్ ఫ్రెండ్లీ” అనే మూవీ చేస్తున్నారు. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్…
మనం అందరమూ భూమి బిడ్డలమే, కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ బాధ్యత నెరవేర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ లో మొక్కలు నాటారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ మనం అందరమూ భూమి బిడ్డలమే…