Home
Mamata Banerjee
Mamata Banerjee News
-
హస్తినలో దీదీ పర్యటన: బీజేపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు…
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి మమత బెనర్జీ దూకుడు పెంచారు. రాబోయో ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం అవుతున్నాయి. ఇటీవలే శరద్పవార్ ఇంట్లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత బీజేపీకి చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు మమత బెనర్జీ. ఈనెల 25 వ తేదీన ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. నాలుగురోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండి కీలక నేతలతో… -
దీదీతో పీకే సుదీర్ఘ మంతనాలు.. ప్లాన్ అదేనా..?
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర… -
బెంగాల్లో శాసన మండలి ఏర్పాటు… శాసన సభ తీర్మానం
మరో కీలక నిర్ణయం తీసుకున్ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో శాసన మండలి లేకపోగా.. కొత్తగా శాసన మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారు.. ఇవాళ శాసన సభ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది.. అసెంబ్లీకి 265 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా.. 196 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.. అయితే, సీఎం మమత బెనర్జీ ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు.. ఆమె అక్టోబరులోగా..… -
బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన పరిణామలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. తనకు టీఎంసీలో ఏ పదవి ఇచ్చినా… సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. బెంగాల్లో బీజేపీ… -
గవర్నర్ను టార్గెట్ చేసిన దీదీ.. కేంద్రానికి మూడు లేఖలు..
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను తొలగించాలంటూ కేంద్రానికి మూడు లేఖలు రాశామన్నారు సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడని, 1996కు చెందిన హవాలా జైన్ కేసులో ఆయనపై చార్జ్షీట్లు కూడా ఉన్నాయని మమత ఆరోపించారు. బెంగాల్ గవర్నర్ను తొలగించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా బహిరంగంగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగాల్ అల్లర్లకు సంబంధించి కేంద్రానికి గవర్నర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గవర్నర్ను వెంటనే వెనక్కి… -
నారద కుంభకోణం.. దీదీకి ఊరట
నారద కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మమతా బెనర్జీ నుంచి రికార్డ్ అఫిడవిట్ తీసుకునేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వం, న్యాయశాఖ మంత్రి హైకోర్టులో తాజా అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. దీనికి ముందు, నారద స్కామ్లో తమ స్టేట్మెంట్ను… -
మళ్లీ తెరపైకి థర్డ్ ఫ్రంట్..! మోడీని ఢీకొట్టే నేత కోసం వేట..?
ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రస్తుతం దేశంలో పాపులారిటీ పరంగా బలమైన నేత..! ఆయన నిర్ణయాలు, వైఫల్యాలపై జనంలో ఆగ్రహం ఉన్నప్పటికీ.. మోడీకి సరి సమానమైన నాయకుడు లేరు. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను జనం ఆదరిస్తున్నా.. దేశం వరకు వచ్చే సరికి మోడీకి జై కొడుతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన వరుస దెబ్బలతో విపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఎన్సీపీ అధినేత శరద్… -
2021 వ్యాక్సినేషన్ పూర్తి చేస్తారా? ఎలా సాధ్యం..?
కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్లో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. దీంతో.. 18 ఏళ్లు పైబడినవారికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభించలేదు.. అయితే, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోంది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్లే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్ల కూడా అనుమతి ఇచ్చింది.. అయితే, డిసెంబర్ చివరి నాటికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న… -
దీదీకి ఊహించని షాక్..!
కేంద్రం, పశ్చిమ బెంగాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా, యాస్ తుఫాన్పై సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ.. బెంగాల్ సీఎం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి రావడం.. కేంద్రానికి మరింత కోపం తెప్పించినట్టుంది.. దీంతో.. దీదీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, వెంటనే రిలీవ్ చేయాల్సింది కేంద్రం సమాచారం ఇచ్చింది.. యాస్ తుఫాన్పై ప్రధాని నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే… -
పలు రాష్ట్రాల సీఎంలతో షా భేటీ…
టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో…
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!