Mahua Moitra: మహువా మోయిత్రా వివాదంపై తొలిసారి స్పందించిన దీదీ.. ఆమెకే ప్లస్ అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం, గిఫ్టులు తీసుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మొదటి నుంచి టీఎంసీ పార్టీ సైలెంట్గా ఉంటోంది. తొలిసారి మహువా మోయిత్రా వివాదంపై తృణమూల్ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. లోక్సభ నుంచి మహువా మోయిత్రాను బహిష్కరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశలు పెరుగుతాయని అన్నారు. లోక్సభ నుంచి మోయిత్రాను తప్పించేందుకు ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. గురువారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
Read Also: Geert Wilders: “ప్రవక్త” వ్యాఖ్యలపై నుపూర్ శర్మకు మద్దతు ఇచ్చిన డచ్ లీడర్ భారీ విజయం..!
మహువా మోయిత్రా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసేందుకు అదానీ గ్రూపుపై ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 ప్రశ్నలు అదానీ వ్యవహారం చుట్టే తిరిగాయని, ఇందుకు ఆమె దర్శన్ హీరానందానీ నుంచి రూ.2 కోట్ల నగదుతో పాటు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మహువా మోయిత్రా బెంగాల్లోని కృష్ణానగర్ ఎంపీగా ఉన్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదట లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆమె లాగిన్ వివారాలపై ఎంక్వైరీ చేయాల్సింది కేంద్రం ఐటీ శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్కి కూడా లేఖ రాశారు. ఈ కేసులో వ్యాపారి దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్కి అఫిడవిట్ సమర్పించారు. మోయిత్రాకు డబ్బులు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నాడు. అయితే ఆమె మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!