ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారతీయ పర్యాటకులు బుకింగ్లను రద్దు చేసుకుంటున్నారు. ఈ సంఘటనల మధ్య మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనా నుంచి ఎక్కువ మంది పర్యాటకులను తన దేశానికి పంపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Lakshadweep vs Maldives: భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది విదేశాల కంటే తక్కువ కాదు. ఇక్కడ అనేక అందమైన ద్వీపాలు, బీచ్లు ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇటీవల అటువంటి అందమైన భారతదేశ ద్వీపం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్నార్కెలింగ్ చేస్తూ కనిపించారు. ఆయన పర్యటన అనంతరం లక్షద్వీప్ నిరంతరం ముఖ్యాంశాలలో ఉంది. అదే సమయంలో,…
చైనా పర్యాటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారత పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, మాల్దీవులపై తాము రెచ్చగొట్టడం గానీ, ఒత్తిడి చేయడం గానీ చేయలేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది.
India-Maldives row: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది.
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగవెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.
MakeMyTrip: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, ఆ తర్వాత మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా భారతీయలు, మాల్దీవులపై విరుచుకుపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ‘‘బాయ్కాట్ మాల్దీవ్స్’’ ట్రెండ్ అవుతోంది. ఆ దేశానికి టూర్ కోసం వెళ్తామనుకున్న ఇండియన్స్ అక్కడ హోటల్స్, వెళ్లేందుకు నిర్ణయించుకున్న ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాత్రం ఆదివారం రాత్రి చైనా వెళ్లారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యల తర్వాత మాల్దీవులపై భారత్ ఆగ్రహం తగ్గుముఖం పట్టడం లేదు. సామాన్య ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీలు కూడా మాల్దీవులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు తన అన్ని విమాన బుకింగ్లను క్యాన్సిల్ చేసింది.
India-Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు వణికిపోతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అక్కడ అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జూ గెలిచిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల వాగ్దానాల్లో ఎక్కువగా భారత వ్యతిరేకతను ప్రదర్శించి మయిజ్జూ గెలిచారు. చైనాకు అత్యంత అనుకూలుడని ఇతనికి పేరుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న 77 మంది భారత సైనికులను మీ దేశం వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.