వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్కు వెళ్లేందుకు భారత్ విముఖత వ్యక్తం చేసినట్లు ఐసీసీకి తెలియజేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ధృవీకరించింది. ఐసీసీ ఈ-మెయిల్పై పీసీబీ స్పందించలేదు. ఐసీసీ నుండి ఏదైనా వ్రాతపూర్వకంగా అందినప్పుడే పాకిస్తాన్ తన విధానాన్ని వెల్లడిస్తుందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం చెప్పారు.
టెంపుల్ సిటీ తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం ఈమెయిల్లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.
కర్ణాటక ప్రభుత్వ (Karnataka Goverment) పెద్దలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాంబు బెదిరింపులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.