తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 15 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన పోస్ట్ను పంచుకుంటూ “హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ ట్వీట్ చేశారు. ఇక…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు మంచి.. క్రేజ్ ఉంది. ఏ ఛానల్ కు లేని ఆదరణ ఉంది. ప్రతి నిత్యం ప్రజల పక్షం అనే నినాదం ప్రజల గుండె చప్పుడై ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్… ముందుకు సాగుతోంది. 2007 సంవత్సరం లో ప్రారంభమైన ఎన్టీవీ ఛానల్.. నేటితో 14 వసంతాలు పూర్తి చేసుకుని… 15 వ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యం లో రాజకీయ ప్రముఖులు, సినీతారలు, ప్రేక్షకులు,…
చిత్ర విచిత్రమైన సంఘటనలకు మన సినిమా పరిశ్రమ వేదిక అవుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు తలచుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా అలాంటి యాదృచ్చికమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ సంఘటనకు కారకులు భూమిక, పూజాహేగ్డే కావటం విశేషం. 2000లో ‘యువకుడు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింద భూమిక. ఆ తర్వాత ఏడాదే పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో భూమికకు వెనుదిరిగి చూసుకునే…
ఈ సినిమా పై మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు తన ప్రైవేట్ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి బావమర్ది సుధీర్ బాబు కొత్త చిత్రమైన “శ్రీదేవి సోడా సెంటర్”ను వీక్షించారు. అనంతరం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. “శ్రీదేవి సోడా సెంటర్” క్లైమాక్స్ రా, ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్. పలాస 1978 తర్వాత దర్శకుడు కరణ్ కుమార్ మరో బోల్డ్ చిత్రంతో వచ్చాడు. సుధీర్ బాబు బ్రిలియంట్. ఇప్పటి వరకు…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలోను అలరిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైటింగ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా గోవా షెడ్యూల్ను పూర్తి చేసారు. ఈ హీరో తన కుటుంబం, సోదరి మంజుల, స్నేహితురాలు, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి ఈ రోజు ఉదయం చార్టర్డ్ విమానంలో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. 2 వారాల పాటు జరిగిన సుదీర్ఘ షెడ్యూల్లో దర్శకుడు పరశురామ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మహేష్, కీర్తిలతో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో “టాప్ మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్” మూవీగా మోత మోగించింది. 2021 జనవరి 1 నుంచి జూన్ 30 మధ్యలో ఇండియాలో సినిమాలకు సంబంధించి “మోస్ట్ ట్వీటెడ్ హ్యాష్ ట్యాగ్”లకు సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ముందంజలో ఉన్నారు. తమిళ సినిమాలు అజిత్ “వాలిమై” ఇందులో…
మెగాస్టార్ చిరంజీవి 155వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఈ రోజు ఉదయం మహేష్ బాబు రివీల్ చేశారు. “చిరు 155” మూవీ తమిళ బ్లాక్ బస్టర్ “వేదాళం”కు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి వరుస అప్డేట్లు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా “చిరు155” మూవీ టైటిల్ ను ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్తో కలిసి పని చేయడానికి చిరు సిద్ధంగా ఉన్నాడు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. తాజా అప్డేట్ ప్రకారం…