‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని తెచ్చిపెట్టిన.. స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటించింది కానీ లావణ్య మాత్రం నిరాశ తప్పలేదు. ఇక ఇటీవల…
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర వహించాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు వైపు తీసుకువెళ్లాడు. దీంతో డేవిడ్ వార్నర్ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మహేష్బాబు కూడా ఉన్నాడు. నిజానికి వార్నర్పై ఈ ప్రపంచకప్లో ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో అతడు రాణించలేదు. దీంతో సన్రైజర్స్ ఏకంగా జట్టు నుంచే వార్నర్ను తప్పించింది. ఈ పేలవ ప్రదర్శన…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 15 కోట్ల “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగా, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన స్ట్రాటజీని రిపీట్ చేయబోతున్నాడని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మహేష్ కోసం రాజమౌళి…
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తున్న తాజా కమర్షియల్ డ్రామా ‘సర్కారు వారి పాట’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి తన సొంత ట్యాలెంట్ ను బయట పెట్టబోతోంది. వెండితెరపై సరిగమలు పలికించి ప్రేక్షకులను అలరించబోతోందట. కీర్తి సురేష్ ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, వయోలిన్…
సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాను స్పూర్తిగా తీసుకొని సుభాష్రెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి జిల్లాలోని బీబీపేటలో పాఠశాలను 8 కోట్లతో అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసిన ఈ పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్వరలోనే శ్రీమంతుడు బృందంతో ఈ స్కూలును సందర్శిస్తానని.. అంతేకాకుండా తన సినిమా స్పూర్తితో ఈ పాఠశాల…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్ తో మిగతా హీరోలతో పోలుస్తూ రచ్చ చేస్తున్నారు. టాలీవుడ్ లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కన్పించడం లేదా ? అన్నట్టుగా మీమ్స్ తోనే నిలదీస్తున్నారు. అయితే ఈ గోలంతా ప్రభాస్, మహేష్ సినిమాల గురించే. ఈ నిలదీత ఇద్దరు స్టార్ హీరోల మేకర్స్ ను ఉద్దేశించే. గత…
సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా…
దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్…
ఈ దీపావళి పండగ ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకు డబుల్ థమాకాను ఇచ్చింది. దీపావళి సందర్భంగా మహేశ్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగానూ ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం జనవరి 13 నుండి ఏప్రిల్ 1కి వాయిదా పడినట్టు ప్రకటించారు. ఓ మంచి సినిమాను భారీ పోటీ మధ్యలో రిలీజ్ చేయకుండా, దర్శక నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘సర్కారు వారి పాట’ వాయిదా వార్తతో ప్రిన్స్ అభిమానులు కాస్తంత డీలా…