తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి.…
తెలుగు స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేశ్ బాబు చేస్తునన్ని వాణిజ్య ప్రకటనలు మరే స్టార్ హీరో చేయడం లేదు. ఆ మధ్యలో ‘అతిథి’ సినిమా తర్వాత మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. 2007 అక్టోబర్ లో ‘అతిథి’ విడుదలై పరాజయం పొందాక, సినిమా నటనకు దూరంగా ఉన్న మహేశ్ కేవలం యాడ్స్ నటిస్తూనే మూడేళ్ళు గడిపేశాడు. అతని అభిమానులకు అవే కాస్తంత ఓదార్పును కలిగించాయి. ‘అతిథి’ వచ్చిన మూడేళ్ళకు గానీ ‘ఖలేజా’ మూవీ రిలీజ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్స్టార్ మహేష్బాబు కలిసి మరోసారి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు. గతంలో భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా అభిమానులను వీరు అలరించారు. తాజాగా జెమినీటీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో వీరిద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో మహేష్బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ఈనెల 5న ఆదివారం రాత్రి 8:30 గంటలకు టెలీకాస్ట్ చేయనున్నట్లు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు. నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ”. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూడవ చిత్రంగా వచ్చిన ‘అఖండ’ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. సినిమాపై సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ‘అఖండ’కు ఫిదా అయ్యి సోషల్ మీడియాలో బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సినిమా విజయానికి బాలయ్యతో…
సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరగబోతోంది అంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన రెండు మూడు నెలల పాటు షూటింగ్కు విరామం తీసుకోవచ్చని సమాచారం. మహేష్ మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నాడని అంటున్నారు. దీనికి…
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్బాస్ షోతో బుల్లితెర అభిమానులను అలరించిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి అభిమానులను సంతోషపరుస్తున్నాడు. ఇప్పటికే ఈ షో కోసం పలువురు గెస్టులు హాజరై ఎన్టీఆర్తో మాటామంతీ కలిపారు. మెగా పవర్స్టార్ రామ్చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, హీరోయిన్ సమంత… ఇలా సెలబ్రిటీలు ఎన్టీఆర్ షోకు హాజరయ్యారు. Read Also:…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఉన్న అందగాళ్ళలో సూపర్ స్టార్ స్టైల్, అందం వేరు. ఆయనంటే ఎంతోమంది మహిళా అభిమానులు పడి చచ్చిపోతుంటారు. హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ ను ఇప్పటికీ కలల రాకుమారుడిగా ఆరాధిస్తారు. తాజా ఫోటోషూట్ మరోసారి అదే నిరూపిస్తుంది. లేటెస్ట్ ఫోటోషూట్లో మహేష్ బాబు…
‘వాలి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఎస్.జె సూర్య.. ‘ఖుషీ’ చిత్రంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగులేని హిట్ ని ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి దేవుడిగా మారాడు. ఇక ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించిన ఈ దర్శకుడు ప్రస్తుతం నటుడిగానే కొనసాగుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘లూప్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ…