అనుమతి లేకుండ అక్రమంగా వంతేనని ప్రారంభించారనే ఆరోపణలతో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నేత ఆదిత్య థాక్రేపై పోలీసు కేసు నమోదైంది. ముంబైలో లోయర్ పరేల్లో డిలిస్లే బ్రిడ్జీ రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు. దీంతో అనుమతి లేకుండా థాక్రే బ్రిడ్జీని నిర్మించారని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్ఎమ్ జోషి పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు శనివారం ఆదిత్య థాక్రేతో పాటు సునీల్ షిండే, సచిన్ అహిర్పై కేసు…
మహారాష్ట్ర లోని కళ్యాణ్-ముర్బాద్ రోడ్ లోని వరప్ గ్రామ సమీపంలో టాటా పవర్ కాంప్లెక్స్ ఉంది. ఆ కంపెనీ ఆవరణలో చిరుతపులి సంచరిస్తున్నది. కాగా పులి సంచారం కంపెనీ లోని సీసీ కెమెరా లో రికార్డు అయినది.
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా గుహ గ్రామంలో కొందరు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు భక్తులను, పూజారిని కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఈనెల 9న లార్డ్ కనిఫ్నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు, పూజారిపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద అతని ఉద్యోగులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
Maharastra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుండి కింద ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుపై పడింది.
Nagpur: ఏదో సినిమాలో చెప్పినట్లు ఒక హిందువు ఈశ్వరుడిని, ముస్లిం అల్లాను, క్రిస్టియన్ ఏసు ప్రభువునే మొక్కుతారు, కానీ అన్ని మతాల వాళ్లు డాక్టర్ని ప్రార్థిస్తారని హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి డాక్టరే దేవుడు. ఇలాంటి ఆదర్శప్రాయమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘టీ’ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
Maharashtra: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమమం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే ఉద్యమం లో పాల్గొన్న చాలామంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఈ రోజు మరో నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాలపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మరాఠా కమ్యూనిటీకి OBC రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జరుగుతున్న ఉద్యమానికి.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగేకి మద్దతు తెలుపుతూ 26 ఏళ్ల యువకుడు రంజిత్ మంజరే విషం తాగాడు. ఈ…