Maharashtra: నేడు మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై చర్చ.. మహావికాస్ అఘాడీ నేతల కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Vikas Aghadi: లోక్సభ ఎన్నికల్లో భారత కూటమి నుంచి మహారాష్ట్రలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అనే విషయం నేడు కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్సీపీ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, మహారాష్ట్రకు సంబంధించి భారత (I.N.D.I.A.) కూటమి సమావేశం జరగనుంది. ఇందులో కాంగ్రెస్, శివసేనతో పాటు ఎస్పీ నాయకులు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై భారత కూటమిలోని పార్టీలు చర్చించనున్నారు. మహారాష్ట్రలో పొత్తుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. త్వరలో ఢిల్లీలో మహావికాస్ అఘాడీ నేతల భారీ సమావేశం జరగనుంది.. అలాగే, అందులో సీట్ల పంపకంపై కూడా చర్చ జరుగుతుందని ఇండియా కూటమి నుంచి సమాచారం. జనవరి 14-15 మధ్య ఢిల్లీలో మహావికాస్ అఘాడీ సమావేశం జరగబోతుంది. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే హాజరవుతారు. ఇందులో సీట్ల పంపకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Read Also: Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ
Also Read
ఇక, ఆదివారం బీహార్లో సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ తో పాటు ఆర్జెడీ నాయకులు వర్చువల్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్లలో సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య నిన్న (సోమవారం) చర్చ జరిగింది. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై లోతైన కొనసాగింది. అయితే, సిట్ల పంపకాలపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో ఆప్ 4 సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చని పలు వర్గాలు తెలిపాయి. అయితే, పంజాబ్ తో పాటు చండీగఢ్లలో ఆప్ 50-50 ఫార్ములాపై అంగీకరించే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు గుజరాత్లో ఒక సీటు, హర్యానాలో మూడు, గోవాలో ఒక సీటును ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక, జనవరి 11 లేదా 12వ తేదీల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: YSRCP: ఒంగోలు ఎంపీ సీటుపై తొలగిన అనిశ్చితి..! ఆయనకు లైన్ క్లియర్..!
అలాగే, బీహార్లో లోక్సభ ఎన్నికల కోసం భారత కూటమి మధ్య సీట్ల పంపకానికి సంబంధించి గతంలోనే ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, భూపేష్ బాఘెల్, సల్మాన్ ఖుర్షీద్, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్లు హాజరయ్యారు. బీహార్లోని 40 స్థానాల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 17-17- 4+1-2 ఫార్ములాను ఆమోదించే ఛాన్స్ ఉంది. ఇక, జేడీయూ, ఆర్జేడీలకు 17 సీట్లు, కాంగ్రెస్కు ఒక రాజ్యసభ సీటుతో పాటు 4 లోక్సభ సీట్లు దక్కనున్నాయి. లెఫ్ట్ పార్టీలకు 2 సీట్లు ఇవ్వొచ్చు అని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?