Maharashtra: నేడు మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై చర్చ.. మహావికాస్ అఘాడీ నేతల కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Vikas Aghadi: లోక్సభ ఎన్నికల్లో భారత కూటమి నుంచి మహారాష్ట్రలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? అనే విషయం నేడు కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్సీపీ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, మహారాష్ట్రకు సంబంధించి భారత (I.N.D.I.A.) కూటమి సమావేశం జరగనుంది. ఇందులో కాంగ్రెస్, శివసేనతో పాటు ఎస్పీ నాయకులు పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై భారత కూటమిలోని పార్టీలు చర్చించనున్నారు. మహారాష్ట్రలో పొత్తుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ సమావేశం ప్రారంభం కానుంది. త్వరలో ఢిల్లీలో మహావికాస్ అఘాడీ నేతల భారీ సమావేశం జరగనుంది.. అలాగే, అందులో సీట్ల పంపకంపై కూడా చర్చ జరుగుతుందని ఇండియా కూటమి నుంచి సమాచారం. జనవరి 14-15 మధ్య ఢిల్లీలో మహావికాస్ అఘాడీ సమావేశం జరగబోతుంది. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే హాజరవుతారు. ఇందులో సీట్ల పంపకంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Read Also: Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ
Also Read
- 120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
- CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Tim David Bike Celebration: బంగ్లాదేశ్పై ఆసీస్ క్లీన్స్వీప్.. బైక్పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
ఇక, ఆదివారం బీహార్లో సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ తో పాటు ఆర్జెడీ నాయకులు వర్చువల్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్లలో సీట్ల పంపకాలపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ల మధ్య నిన్న (సోమవారం) చర్చ జరిగింది. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై లోతైన కొనసాగింది. అయితే, సిట్ల పంపకాలపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించాయి. ఢిల్లీలో ఆప్ 4 సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చని పలు వర్గాలు తెలిపాయి. అయితే, పంజాబ్ తో పాటు చండీగఢ్లలో ఆప్ 50-50 ఫార్ములాపై అంగీకరించే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు గుజరాత్లో ఒక సీటు, హర్యానాలో మూడు, గోవాలో ఒక సీటును ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక, జనవరి 11 లేదా 12వ తేదీల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: YSRCP: ఒంగోలు ఎంపీ సీటుపై తొలగిన అనిశ్చితి..! ఆయనకు లైన్ క్లియర్..!
అలాగే, బీహార్లో లోక్సభ ఎన్నికల కోసం భారత కూటమి మధ్య సీట్ల పంపకానికి సంబంధించి గతంలోనే ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, భూపేష్ బాఘెల్, సల్మాన్ ఖుర్షీద్, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్లు హాజరయ్యారు. బీహార్లోని 40 స్థానాల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 17-17- 4+1-2 ఫార్ములాను ఆమోదించే ఛాన్స్ ఉంది. ఇక, జేడీయూ, ఆర్జేడీలకు 17 సీట్లు, కాంగ్రెస్కు ఒక రాజ్యసభ సీటుతో పాటు 4 లోక్సభ సీట్లు దక్కనున్నాయి. లెఫ్ట్ పార్టీలకు 2 సీట్లు ఇవ్వొచ్చు అని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
-
Deewana : సెన్సార్ తీరుపట్ల కంటతడి పెట్టుకున్న దీవాన దర్శకుడు
-
Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!