Maoist Surrender: మావోయిస్టులకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. రేపు, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోతారు. ఆశన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు.
మహారాష్ట్రలో మహా ఘోరం జరిగిపోయింది. డాక్టర్ కావాల్సిన ఓ విద్యాకుసుమం అర్థాంతరంగా రాలిపోయింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ రోజే ఈలోకం నుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ముంబై లో త్వరలో పాడ్ ట్యాక్సీలు తీసుకు వస్తున్నామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. కుర్లా బాంద్రా రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణా కోసం వీటిని ప్రవేశపెడుతున్నట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. బుల్లెట్ ట్రేన్ ర్వైల్వే స్టేషన్, కొత్త ముంబై మైకోర్టు భవనం నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో తీవ్రంగా రద్దీ ఏర్పడిందని అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గించడానికి పాడ్ ట్యాక్సీలు తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. పాడ్ ట్యాక్సీలు అంటే…
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు దడ పుట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు చోట్ల ముగ్గురిపై దాడి చేశాయి. పులుల దాడులలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నాడు. మరో బాలుడిని అటవీ ప్రాంతంలోకి చిరుత లాక్కెళ్ళింది. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ మూడు ఘటనలతో చంద్రపూర్ జిల్లా ఉలిక్కిపడింది. చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలోని మౌజా లావరీ గ్రామానికి చెందిన మహిళ విద్యా కైలాస్ మస్రామ్…
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కుటుంబం అదృశ్యమైంది. గత నాలుగు రోజులుగా ఆమె కుటుంబం కనిపించడం లేదు. మహారాష్ట్ర అంతటా పోలీసులు గాలిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
మహారాష్ట్ర గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్గా ప్రమాణం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Heart attack: ఇటీవల కాలంలో వరస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. యువతతో పాటు చిన్నపిల్లలు కూడా అకస్మాత్తు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు శ్రావణ్ అజిత్ గవాడే హార్ట్ ఎటాక్తో మరణించాడు.
పుణేలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. భర్త ప్రాణాలను కాపాడేందుకు భార్య తన కాలేయాన్ని దానం చేసింది. అయితే వైద్యులు చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో దురదృష్టవశాత్తూ భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే, పుణేకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. వైద్యులు కాలేయ మార్పిడి మాత్రమే చివరి మార్గమని సూచించారు. ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భార్య ముందుకు వచ్చి భర్తకు కాలేయం…