మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.
Wine Shops: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.
INDIA bloc: ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీని అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ పలు పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. ఇప్పటికే, ఇండియా కూటమి రూపశిల్పిగా పేరున్న సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీతో పొత్తును కాదని, ఇండియా కూటమికి గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టారు. ఇక టీఎంసీ చీఫ్,…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.
NDA vs INDIA: 2024 లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇందులో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్యే ఉంటుంది. అయితే అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో ఎవరు గెలుస్తారు. ఇందుకు సంబంధించి సీ-వోటర్తో ఏబీపీ సర్వే నిర్వహించింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతంలో బీజేపీ బలమైన స్థానంలో ఉందని…
Devendra Fadnavis: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధానిగా గెలిపించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీకి బంపర్ మెజారిటీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ప్రజలు మనసు మార్చుకోరని అన్నారు.
ఏపీ లోక్సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో గెలిచి క్లీన్స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్సీపీ విజయం తథ్యమని వెల్లడించింది.
2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. 2024 లోక్సభ ఎన్నికలపై విస్తృత చర్చలు జరిగాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ/ఎన్డీఏ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లోని గత మూడు నెలల నివేదిక కార్డును అందజేస్తారని, దానిపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300కు పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం దిబ్రూఘర్ లో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్ సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.