NDA vs INDIA: 2024 లోక్సభ ఎన్నికల్లో ఎవరిది పైచేయి?.. సీ-ఓటర్ సర్వేలో అనూహ్య ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA vs INDIA: 2024 లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇందులో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్యే ఉంటుంది. అయితే అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో ఎవరు గెలుస్తారు. ఇందుకు సంబంధించి సీ-వోటర్తో ఏబీపీ సర్వే నిర్వహించింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతంలో బీజేపీ బలమైన స్థానంలో ఉందని తేలింది. కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఎదురుదెబ్బ తగిలినట్లే. గత రెండు రోజులుగా అంటే శని, ఆదివారాల్లో ఏబీపీ సీ-ఓటర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో సీట్ల గణితాన్ని వివరించారు. వీటిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక మొదలైనవి ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో మొత్తం 110 స్థానాలకు గాను బీజేపీ 82 నుంచి 92 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్కు 13-23 సీట్లు వస్తాయని, ఇతరులకు 4-6 సీట్లు వస్తాయని అంచనా. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్లలో కాంగ్రెస్ మెరుగ్గా కనిపిస్తోంది. అదే సమయంలో, బెంగాల్లో టీఎంసీ, బీహార్లో మహాకూటమి అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.
Read Also: Pakistan: పాక్ ఎన్నికల్లో పోటీ చేయనున్న హఫీజ్ సయీద్ కుమారుడు..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
బీహార్లో బీజేపీకి షాక్
సర్వే ప్రకారం బీహార్లో మహాకూటమికి విపరీతమైన మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. మహాకూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఇతరులకు 18 శాతం ఓట్లు రావచ్చు. సీట్ల వారీగా చూస్తే మహాకూటమికి 21 నుంచి 23 సీట్లు వస్తాయని అంచనా.
బీహార్లో ఇలా..
మొత్తం సీట్లు-40
బీజేపీ: 16-18
మహాకూటమి: 21-23
ఇతరులు: 0-2
మధ్యప్రదేశ్లో బీజేపీ హవా
లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ మళ్లీ మెరిసే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన పనితీరును పునరావృతం చేస్తున్నట్లు సర్వేలో తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 58 శాతం ఓట్లు వస్తాయని అంచనా. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 36 శాతం ఓట్లతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్లో ఇలా..
మొత్తం సీట్లు 29
బీజేపీ: 27-29
కాంగ్రెస్: 0-2
ఇతరులు: 0
బెంగాల్లో ఎవరు పాలిస్తారు?
బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. సీ-ఓటర్ సర్వేలో టీఎంసీకి 44 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. 42లో 23 నుంచి 25 సీట్లు వస్తాయని అంచనా. బీజేపీకి 39 శాతం ఓట్లు రావచ్చు. ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తాయని అంచనా. ఈ విధంగా టీఎంసీ రాష్ట్రంలో తన 2019 పనితీరును పునరావృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలకు 8 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా.
పశ్చిమ బెంగాల్, మొత్తం సీట్లు-42
బీజేపీ: 16-18
కాంగ్రెస్+ లెఫ్ట్ పార్టీస్: 0-2
టీఎంసీ: 23-25
ఇతరులు: 0
మహారాష్ట్ర, మొత్తం సీట్లు- 48
బీజేపీ: 19-21
కాంగ్రెస్: 26-28
ఇతరులు: 0-2
పంజాబ్, మొత్తం సీట్లు-13
బీజేపీ: 0-2
కాంగ్రెస్: 5-7
ఆప్: 4-6
ఇతరులు: 0
కర్ణాటక, మొత్తం సీట్లు-28
బీజేపీ: 22-24
కాంగ్రెస్: 4-6
ఇతరులు: 0
తెలంగాణలో మొత్తం సీట్లు-17
బీజేపీ: 1-3
కాంగ్రెస్: 9-11
బీఆర్ఎస్: 3-5
ఇతరులు: 2
ఛత్తీస్గఢ్, మొత్తం సీట్లు-11
బీజేపీ: 9-11
కాంగ్రెస్: 0-2
ఇతరులు: 0
రాజస్థాన్, మొత్తం సీట్లు- 25
బీజేపీ: 23-25
కాంగ్రెస్: 0-2
ఇతరులు: 0
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!