DK ShivaKumar: బీజేపీ-జేడీఎస్ పొత్తుపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK ShivaKumar: 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను జనవరిలోపు ఖరారు చేసే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
Also Read: Keerthy Suresh: కాటుక కాళ్ళతో కట్టి పడేస్తున్న కీర్తి సురేష్
Also Read
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
డీకే శివకుమార్ మాట్లాడుతూ.. “బీజేపీ-జేడీఎస్ పొత్తు తర్వాత చాలా మంది బీజేపీ, జేడీఎస్ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాతో మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రితో పాటు కొంతమంది కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో చర్చించాల్సి ఉంటుంది. నేను బీజేపీ, జేడీఎస్ నేతలను కూడా కలిశాను. చర్చల అనంతరం వారిని సంప్రదిస్తానని చెప్పాను.” అని ఆయన వెల్లడించారు. చాలా మంది బీజేపీ-జేడీఎస్ నేతలు కాంగ్రెస్లో చేరాలని ఆకాంక్షించారని డీకే శివకుమార్ తెలిపారు. తమతో సంప్రదింపులు జరపకపోవడంతో పొత్తుపై తాము సంతోషంగా లేమని చెప్పారని ఆయన వెల్లడించారు. ఇతర పార్టీల కార్యకర్తలను వారి స్థాయిలో చేర్చుకోవాలని తాను ఇప్పటికే స్థానిక నాయకత్వాన్ని కోరానన్నారు.
Also Read: Kishan Reddy : భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు పండిట్జీ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరం.
జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. బీజేపీ-జేడీఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు ఫిరాయింపుల నిరోధక చట్టం అడ్డుగా వస్తోందని అడిగిన ప్రశ్నకు, సాంకేతిక సమస్యల గురించి మాకు తెలుసు, ఆ అంశంపై మాట్లాడబోనని కేపీసీసీ చీఫ్ సమాధానమిచ్చారు. అలాగే, రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమించిందని ఆయన తెలిపారు. 28 నియోజకవర్గాలకు మొత్తం 28 మంది మంత్రులను విడివిడిగా నియమించారని చెప్పారు. ఎనిమిది నుంచి పది రోజుల్లో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు చెబుతారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉండాలనే అంశంపై బహిరంగంగా చర్చించవద్దని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలను కోరిన లేఖపై శివకుమార్ వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యకు, ఆయనకు మధ్య గట్టి పోటీ నెలకొనడంతో, శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం అని కాంగ్రెస్ నిర్ణయించింది.
తాజావార్తలు
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!