DK ShivaKumar: బీజేపీ-జేడీఎస్ పొత్తుపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK ShivaKumar: 2024 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ, జేడీఎస్లు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలు తనను సంప్రదించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం ప్రకటించారు. అలాగే కాంగ్రెస్లో చేరాలని భావిస్తున్నట్లు ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను జనవరిలోపు ఖరారు చేసే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
Also Read: Keerthy Suresh: కాటుక కాళ్ళతో కట్టి పడేస్తున్న కీర్తి సురేష్
Also Read
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
డీకే శివకుమార్ మాట్లాడుతూ.. “బీజేపీ-జేడీఎస్ పొత్తు తర్వాత చాలా మంది బీజేపీ, జేడీఎస్ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాతో మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రితో పాటు కొంతమంది కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో చర్చించాల్సి ఉంటుంది. నేను బీజేపీ, జేడీఎస్ నేతలను కూడా కలిశాను. చర్చల అనంతరం వారిని సంప్రదిస్తానని చెప్పాను.” అని ఆయన వెల్లడించారు. చాలా మంది బీజేపీ-జేడీఎస్ నేతలు కాంగ్రెస్లో చేరాలని ఆకాంక్షించారని డీకే శివకుమార్ తెలిపారు. తమతో సంప్రదింపులు జరపకపోవడంతో పొత్తుపై తాము సంతోషంగా లేమని చెప్పారని ఆయన వెల్లడించారు. ఇతర పార్టీల కార్యకర్తలను వారి స్థాయిలో చేర్చుకోవాలని తాను ఇప్పటికే స్థానిక నాయకత్వాన్ని కోరానన్నారు.
Also Read: Kishan Reddy : భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు పండిట్జీ మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోవడం బాధాకరం.
జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. బీజేపీ-జేడీఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునేందుకు ఫిరాయింపుల నిరోధక చట్టం అడ్డుగా వస్తోందని అడిగిన ప్రశ్నకు, సాంకేతిక సమస్యల గురించి మాకు తెలుసు, ఆ అంశంపై మాట్లాడబోనని కేపీసీసీ చీఫ్ సమాధానమిచ్చారు. అలాగే, రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వంలోని చాలా మంది మంత్రులను కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమించిందని ఆయన తెలిపారు. 28 నియోజకవర్గాలకు మొత్తం 28 మంది మంత్రులను విడివిడిగా నియమించారని చెప్పారు. ఎనిమిది నుంచి పది రోజుల్లో ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు చెబుతారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కువ మంది ఉప ముఖ్యమంత్రులు ఉండాలనే అంశంపై బహిరంగంగా చర్చించవద్దని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలను కోరిన లేఖపై శివకుమార్ వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్యకు, ఆయనకు మధ్య గట్టి పోటీ నెలకొనడంతో, శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం అని కాంగ్రెస్ నిర్ణయించింది.
తాజావార్తలు
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!