ఇండియాలో జీప్ కంపాస్ SUV యొక్క ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్ను విడుదల చేసింది. యానివర్సరీ ఎడిషన్ను, సరికొత్త అప్ డేట్స్తో (అక్టోబర్ 3) గురువారం రోజు లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కాస్మెటిక్, యాక్సెసరీ అప్డేట్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ బ్రాండ్ కు భారత్ లో ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను ప్రకటించారు.
ఇండియాలో లావా అగ్ని-సిరీస్ తాజా 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. లావా అగ్ని 3 5G స్మార్ట్ఫోన్లో డ్యూయల్ డిస్ప్లే, 256GB వరకు స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా అగ్ని 3 5G 8GB ఇంబిల్ట్ RAM.. 8GB వర్చువల్ RAMతో 16 GB వరకు మొత్తం RAM సపోర్ట్ చేస్తుంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
2022లో ప్రారంభించిన EV6 క్రాస్ఓవర్ తర్వాత కియా ఇండియా.. ఆల్-ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. EV9 ఆల్-ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ AWD వేరియంట్లో అందిస్తున్నారు. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్).
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ పార్టీ (Jan Suraj Party)ని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
మరొక హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ (Zelio eBikes Mystery) ఎలక్ట్రిక్ టూ వీలర్ భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ను రూ.81,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.మ
iphone 16 Delivery : కొత్తగా లాంచ్ అయిన Apple iPhone 16 సిరీస్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు వెయిటింగ్ పిరియడ్ ముగిసింది. ఐఫోన్ 16 సిరీస్లోని అన్ని మోడల్లు శుక్రవారం భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య యుద్ధం తీవ్రతరంగా మారుతోంది. శుక్రవారం.. లెబనాన్లోని హిజ్బుల్లా, ఉత్తర ఇజ్రాయెల్పై ఒకదాని తర్వాత ఒకటి మూడు దాడులు చేసింది. ఈ మూడు దాడుల్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు దాదాపు 140 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టం ఎంతనేది తెలియరాలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లు SUV సెగ్మెంట్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. 2024 సంవత్సరం ఫస్టాప్లో కార్ల విక్రయాలలో SUV అధికంగా విక్రయించింది. కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, ఎక్సెటర్ వంటి SUVలు ఉన్నాయి.
యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్ను విడుదల చేసింది. ఈ బైక్లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు.
టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.