Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం..
- విద్యుత్ యూనిట్పై రూ.2 రాయితీ ప్రకటన..
- మహిళలకు రూ.10 లక్షల రుణాలపై రూ.2 లక్షల రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు, విద్యుత్ స్టవ్లను ఉపయోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులకు విద్యుత్ యూనిట్కు రూ. 2 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్లకు మారాలనుకునే చిన్న తరహా పరిశ్రమలు (MSME), చిన్న వ్యాపారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ రుణాలపై 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. వారు తీసుకునే రూ. 10 లక్షల లోపు రుణాలపై రూ. 2 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు , విద్యా సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేస్తోంది. ఫలితంగా వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది. హోటళ్లు మూతపడితే.. వాటిపై ఆధారపడిన రైతులు, కూరగాయల సరఫరాదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి.. హోటళ్లు నిరంతరాయంగా నడవాలని ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను తీసుకువచ్చింది. హోటళ్లు మూతపడకుండా ఉండేలా చూడటంతో పాటు.. రైతులు తమ పంటలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నేరుగా రైతు బజార్లలో అమ్ముకోవడానికి అనుమతినిచ్చారు. సామాన్యుల అవసరాలను తీర్చడానికి రేషన్ కార్డుదారులకు ఈ నెలలో అదనంగా కిరోసిన్ను సరఫరా చేయనున్నారు. గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టడానికి, పంపిణీని సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!