Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం..
- విద్యుత్ యూనిట్పై రూ.2 రాయితీ ప్రకటన..
- మహిళలకు రూ.10 లక్షల రుణాలపై రూ.2 లక్షల రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు, విద్యుత్ స్టవ్లను ఉపయోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులకు విద్యుత్ యూనిట్కు రూ. 2 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్లకు మారాలనుకునే చిన్న తరహా పరిశ్రమలు (MSME), చిన్న వ్యాపారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ రుణాలపై 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. వారు తీసుకునే రూ. 10 లక్షల లోపు రుణాలపై రూ. 2 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు , విద్యా సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేస్తోంది. ఫలితంగా వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది. హోటళ్లు మూతపడితే.. వాటిపై ఆధారపడిన రైతులు, కూరగాయల సరఫరాదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి.. హోటళ్లు నిరంతరాయంగా నడవాలని ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను తీసుకువచ్చింది. హోటళ్లు మూతపడకుండా ఉండేలా చూడటంతో పాటు.. రైతులు తమ పంటలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నేరుగా రైతు బజార్లలో అమ్ముకోవడానికి అనుమతినిచ్చారు. సామాన్యుల అవసరాలను తీర్చడానికి రేషన్ కార్డుదారులకు ఈ నెలలో అదనంగా కిరోసిన్ను సరఫరా చేయనున్నారు. గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టడానికి, పంపిణీని సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!