Home
Latest Telugu News
Latest Telugu News News
-
ఇండియన్ ఓపెన్ సెమీస్కు దూసుకెళ్లిన పీవీ సింధు
భారత బ్మాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. ఇండియన్ ఓపెన్-2022లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో అశ్మిత చలిహా క్రీడాకారిణిని వరుసగా రెండు సెట్లలోనూ పీవీ సింధు ఓడించింది. తొలి సెట్లో 21-7 తేడాతో, రెండో సెట్లో 21-18 పాయింట్ల తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. ఈ క్వార్టర్స్ గెలుపుతో పీవీ సింధు సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది. Read Also: కేప్టౌన్ టెస్టులో టీమిండియా ఓటమి.. సిరీస్ సమర్పయామి అంతకుముందు మ్యాచ్లో ఏరా… -
తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం జగన్ దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ బట్టల్లో కనిపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సమీపంలోని గోశాలలో జరిగిన సంక్రాంతి సంబరాలకు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ వేడుకలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పల్లెటూళ్లలో సంక్రాంతి సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహిస్తారో వాటిని అన్నింటినీ తాడేపల్లి… -
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్లో బాంబు ఉందని పోలీసులకు సమాచారం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగ్ను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్కు, ఎన్ఎస్జీ అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. Read Also: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి పోలీసులు ఇచ్చిన… -
చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో ఉద్యోగి మృతి
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం… -
హైదరాబాద్లో హీరో సిద్ధార్థ్పై కేసు నమోదు
పంజాబ్లో ప్రధాని మోదీ భద్రత అంశం విషయంలో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను ఉద్దేశిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సిద్ధార్థ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైనాపై సిద్ధార్థ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సిద్ధార్థ్పై సెక్షన్ 67 యాక్టు, ఐపీసీ… -
కేప్టౌన్ టెస్ట్: టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో భారత బౌలర్లు తమ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ను సఫారీ జట్టును 210 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా జట్టులో పీటర్సన్ 72 పరుగులతో రాణించాడు. బవుమా 28, కేశవ్ మహారాజ్ 25, డస్సెన్ 21 పరుగులు చేశారు. Read Also: టీమిండియా వన్డే జట్టులో సైనీ, జయంత్ యాదవ్లకు చోటు భారత బౌలర్లలో బుమ్రాకు 5 వికెట్లు… -
ఇస్రోకు కొత్త సారథి… ఈనెల 14న బాధ్యతల స్వీకరణ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన ఛైర్మన్గా ఎస్.సోమనాథ్ నియామకం అయ్యారు. 2018 నుంచి విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్గా సోమనాథ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 14తో ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం ముగియనుంది. అనంతరం సోమనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేరళకు చెందిన సోమనాథ్ దేశంలో టాప్ రాకెట్ సైంటిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. ఉపగ్రహ వాహక నౌకల డిజైనింగ్లో సోమనాథ్ కీలక పాత్ర పోషించారు. కెరీర్ తొలినాళ్లలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్… -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఏం రాశారంటే..?
ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని లేఖలో కోరారు. ఆరేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016లో హామీ ఇచ్చారని… ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర నష్టాల్లో ఉందని.. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరగడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రైతు… -
ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. మహిళా పోలీస్ విభాగం ఏర్పాటు
ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా పోలీస్ విభాగంలో మొత్తం ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉండనున్నాయి. మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ,… -
సామాన్యులకు మరో షాక్.. పెరిగిన సబ్బులు, డిటర్జెంట్ ధరలు
ప్రముఖ కంపెనీ హిందూస్థాన్ యూనీలివర్ (HUL) సామాన్యులకు మరోసారి షాకిచ్చింది. గత ఏడాది నవంబరులోనే పలు ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్యూఎల్ తాజాగా మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్బాయ్ సబ్బుల ధరలను 3 నుంచి 20 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. తాజా ధరల ప్రకారం బట్టలు ఉతికేందుకు…
తాజావార్తలు
-
Rajnath Singh: డబుల్ ఇంజిన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. బెంగాల్లో రాజ్నాథ్సింగ్ ప్రచారం
-
Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
Supreme Court: నేతాజీని జాతీయ పుత్రుడిగా ప్రకటించలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
-
CM Chandrababu Birthday: అన్న క్యాంటీన్లో చంద్రబాబు దంపతులు.. పేదలతో కలిసి సీఎం అల్పాహారం!
ట్రెండింగ్
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!
-
Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!