Home
Latest Telugu News
Latest Telugu News News
-
ICC WTC: పాయింట్ల పట్టికలో మెరుగైన టీమిండియా ర్యాంక్
సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఈ రెండు టెస్టులు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. 58 శాతం విజయాలతో ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీలో భాగంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్లు ఆడిన టీమిండియా ఆరు విజయాలు సాధించింది. మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. రెండు మ్యాచ్లను డ్రా చేసుకుంది. మొత్తంగా… -
Hijab controversy: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు.. హిజాబ్ తప్పనిసరి కాదు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది. ఇస్లాం మతపరంగా అంతగా ముఖ్యమైన అంశం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ రితూ రాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మానం ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.… -
Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్.. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
ఏపీలో వేసవి తాపం మొదలైపోయింది. వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని… -
Russia Ukraine War: రష్యా దాడుల్లో ఒక్క నగరంలోనే 2,500 మంది మృతి
రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై క్షిపణి దాడులతో రష్యా బలగాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ శవాల గుట్టలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2,500 మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. రష్యా దాడులు… -
Andhra Pradesh: ఏపీలో పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు
ఏపీలో గత మూడేళ్లుగా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు సోమవారం నాడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో గత ఐదేళ్లలో 294 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వివరించారు. 2017లో 55 మంది, 2016లో 36 మంది, 2017లో 55 మంది, 2018లో 44 మంది, 2019లో 71 మంది, 2020లో 88 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం… -
Telangana: నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 7న ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు బడ్జెట్ను ప్రవేశ పెట్టగా.. 9న సాధారణ బడ్జెట్పై చర్చ జరిగింది. అలాగే తర్వాతి నాలుగు రోజుల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. మొత్తంగా 37 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈరోజు చివరి రోజు కాబట్టి.. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరగనుంది. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన తర్వాత.. ఎఫ్ఆర్ఎంబీ,… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్★ తిరుమల: నేడు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో మూడో రోజు.. ఈరోజు తెప్పలపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేతుడు మలయప్పస్వామి★ నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు వ్యాట్ సవరణ బిల్లు… నేటితో ముగియనున్న బడ్జెట్పై చర్చ.. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ప్రతిపాదనపై సమాధానం చెప్పనున్న సీఎం జగన్★ నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. నేడు… -
Hijab Row : కర్ణాటకలో రేపే తీర్పు..
Karnataka High Court Going Verdict Tomorrow on Hijab Row Issue. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హిజాబ్ వివాదంపై క్లారిటీ రానుంది. తరగతులకు హిజాబ్తో రావద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాటకను అల్లకల్లోలానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదముందంటూ జనం భయాందోళనలకు గురయ్యారు. దీంతో దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ… -
Kiran Abbavaram: తిరుపతిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు తొలి రెండు చిత్రాలు ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని గుర్తింపు నిచ్చాయి. ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ కమర్షియల్ గానూ చక్కని విజయాన్ని అందుకుంది. కానీ మూడో సినిమా ‘సెబాస్టియన్’ మాత్రం కిరణ్ కు తీవ్ర నిరాశను కలిగించింది. చిత్రం ఏమంటే… ఈ సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండానే అతనితో అగ్ర నిర్మాణ సంస్థలు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అరవింద్ సమర్పణలో… -
Buffoon: వైభవ్ మాస్ హీరో కాబోతున్నాడా!?
Hero Vaibhav New Movie Buffoon Trailer Released. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ తెలుగులో కొన్ని చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే… ఇక్కడ కంటే కోలీవుడ్ లోనే అతనికి కలిసొచ్చింది. అక్కడ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు చేశాడు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించాడు. తాజాగా అతను హీరోగా ‘బఫూన్’ సినిమా తెరకెక్కుతోంది. సముద్రతీరంలో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు…
తాజావార్తలు
-
Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి
-
Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు
-
KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ.. ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన మెట్రో..
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!