కొత్త రేషన్ కార్డుల పంపిణీని పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సబ్కమిటీలో పౌరసరఫరాలు & నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ సబ్కమిటీకి…
ప్రాథమిక పారిశుధ్య నిర్వహణలో విఫలమై నిధులను పక్కదారి పట్టిస్తోందని, గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యుడు టీ హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తక్షణమే నిధులు విడుదల చేయాలని మంత్రి డి అనసూయ అలియాస్ సీతక్క చేస్తున్న ఆరోపణలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. గ్రామపంచాయతీల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు గట్టి కౌంటర్లో మండిపడ్డారు. Asaduddin Owaisi: ముస్లింలను అంతం చేయడమే వక్ఫ్…
కొన్ని కొన్ని సార్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కొందరు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తరువాత బాధపడుతుంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్ చేస్తోంది ఓ మహిళ. అయితే.. అదే సమయానికి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది కాని.. ఆమె ఉన్న చోట ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో కోపంతో అందుబాటులో ఉన్న బీర్ బాటిల్ను బస్సుపైకి రువ్వింది. ఆ మహిళ విసిరిన బీర్ బాటిల్ బస్సు వెనుక భాగంలోని…
వర్షాల నేపథ్యంలో చెట్లు, స్థంబాలు, విద్యుత్ వైర్స్ ఒరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం దేశానికి తలమానికమని, హైదరాబాద్ కు చాలా మల్టిలేవల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సూచించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో అధికారులతో మాట్లాడి ముందుకు వెళ్తామని, సుంకిశాల గోడ కూలిందని చూశానని, హైదరాబాద్ కి నీటి…
ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని, కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదని ఆయన అన్నారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అన్నారు. 2 ఎంపీలతో బీజేపీ…
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం నాడు వ్యతిరేకించారు. “వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఈ సవరణలు చేయడానికి ఈ సభకు అర్హత లేదు. ఈ బిల్లు ఆర్టికల్స్ 14, 15, మరియు 25 కింద ఉన్న సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రత మరియు అధికార విభజన సూత్రాలను ఉల్లంఘించినందున ఇది వివక్షత,…
ధరణి మాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. 23 వ తేది వరకు అందరి సలహాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ధరణిలో జరిగినవి మాములు తప్పులు కాదని, అన్ని సంఘాలు…పార్టీల…
లోక్సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత సభలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేంద్రం (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్కు గత లోక్సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. అయితే.. లోక్ సభలో జీరో అవర్లో ఎంపీ బలరాం…
తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బీఆర్ఎస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుందని రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారన్నారు.…
గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 21.096 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.