చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేతన్నలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేయగా.. స్టాళ్లల్లో ఉత్పత్తులను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ స్టాళ్లలో సతీమణి భువనేశ్వరి కోసం చీరలను కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలను కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొనుగోలు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త.
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది.
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం లో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందన, రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడన్నారు. రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా…
గత రాత్రి నుంచి కురుస్తున్న బారీ వర్షాల వల్ల కొత్తగూడెం పట్టణంలోకి నీళ్లు వచ్చారు.మాతా శిశు ఆసుపత్రి చుట్టు వరద నీరుచేరడంతోఆసుపత్రిలో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఎగువన ఉన్న చెరువుల నీరు అంతా పొంగి ప్రవహించి పట్టణంలోకి రావడంతో ప్రజలు ఇక్కట్లకు గురి అయ్యారు.దీంతోపట్టణంలోకి వాహనాలు రాకుండా నిలిపివేశారు. విద్యా నగర్ సమీపంలోని కొన్ని కాలనీలకు వరద నీరుచేరింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లోకి చింత చెరువు ద్వారా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రధానరహదారి…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల చేనేతను గుర్తించి ప్రయోజనకరమైన పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కోరారు. చేనేత కార్మికులకు మేలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించాలని, చేనేత పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం చేనేత రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని, దేశ చరిత్రలో…
చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా వద్ద చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. చేనేత రంగం మన దేశపు పురాతన సంపద, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. చేనేత రంగంలో నిపుణులైన మన చేనేత కార్మికుల అంకితభావం, సృజనాత్మకత దేశానికి గర్వకారణమని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి…
హైదరాబాద్ నగరంలో న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్కు ఓ రౌడీ షీటర్ కత్తితో రక్తపు గాయం చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మైలార్దేవ్పల్లిలో చోటుచేసుకుంది. వట్టెపల్లికి చెందిన బాధితుడు ముబీన్ మీర్జా, మహమూదా హోటల్ సమీపంలో నిలబడి ఉండగా, రౌడీ షీటర్ సోహైల్ , అతని సహచరులు వచ్చి అకస్మాత్తుగా బాధితుడి ముఖంపై కత్తితో దాడి చేశారు. క్షతగాత్రుడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి…