Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News They Are Conspiring To Damage Indian Culture With Nonsense

Bandi Sanjay : అర్ధంపర్ధంలేని అంశాలతో భారతీయ సంస్కృతిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు

Published Date :August 10, 2024 , 11:07 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay : అర్ధంపర్ధంలేని అంశాలతో భారతీయ సంస్కృతిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతీయ సంస్క్రుతి గల గల పారే జీవనది లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భారతీయ సంస్క్రుతి, సాంప్రదాయాలపై దాడి చేస్తూ సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సమాజాన్ని ఏకం చేస్తూ భారతీయ విలువలు పెంపొందిస్తూ ప్రజ్ఝాభారతి ఆధ్వర్యంలో ‘లోక్ మంథన్’ పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో ఈరోజు సాయంత్రం జరిగిన ‘లోక్ మంథన్ సన్నాహక సమావేశానికి’ బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. ప్రజ్ఝాభారతి వ్యవస్థాపకులు, పద్మశ్రీ టి.హనుమాన్ చౌదరి, సామవేదం షణ్ముగశర్మ, నందకుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

నవంబర్ 21 నుండి 24 వరకు భాగ్యనగర్ లోని హైటెక్ సిటీ శిల్పకళావేధికలో జరగబోయే ‘లోక్ మంథన్’ ఇంటర్నేషనల్ సమావేశ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక సమావేశానికి రావడం సంతోషంగా ఉంది. లోకంలో(ప్రపంచంలో) జరుగుతున్న అనేక అంశాలపైన, మార్పులుపైన చర్చించడంతోపాటు హిందూ సమాజ ప్రగతి, భారతీయ సనాతన విలువలను పెంపొందించేందుకు ‘లోక్ మంథన్’ వేదికగా కావడం గొప్ప విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే… లోక కళ్యాణం కోసమే ‘లోక్ మంథన్’…(సర్వేజన సుఖి:నోభవంతు)

అదే సమయంలో సమాజానికి మంచితోపాటు చెడు కలిగించే అంశాలు కూడా ఉంటాయి. వాటిపై లోతుగా చర్చిస్తూ భారతీయ సంస్క్రుతి, హిందూ సమాజ ప్రగతికి అవసరమైన మంచిపై అవగాహన కల్పించేందుకు ‘లోక్ మంథన్’ చేస్తున్న క్రుషి అభినందనీయం. అర్ధం పర్ధం లేని అంశాలు తెరపైకి తీసుకొచ్చి భారతీయ సంస్క్రుతి, సాంప్రదాయాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో లోక్ మంథన్ చేస్తున్న క్రుషి అభినందనీయం. భారతీయ సనాతన ధర్మం విషయంలో సమాజంలో చీలికలు తెస్తున్న సందర్భంలో మీలాంటి అనేక మంది మేధావులు, విద్యావేత్తలు లోక్ మంథన్ పేరుతో చేస్తున్న క్రుషి మరువలేనిది.

తరాలు మారుతున్నయ్… యుగ ధర్మాలు మారుతున్నయ్…. అందుకు అనుగుణంగానే భారతీయ సంస్క్రుతి, సంప్రదాయాల్లో, హిందూ సమాజంలో మార్పులు రావడం సహజం. ఎంత మంచి నీళ్లైనా సరే.. ఒకే చోట కదలకుండా నిశ్చలంగా ఉంటే ఆ నీరు ఖరాబవుతుంది. బాక్టీరియా చేరుతుంది. నాచు చేరుతుంది. మారుతున్న కాలానికి, ధర్మానికి అనుగుణంగా హిందూ సమాజ విలువల్లో కూడా మార్పు అనివార్యం. ఎందుకంటే హిందూ సమాజం ప్రవహించే జీవ నదిలాంటిది. ప్రవహించే జీవనదిలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. సమజంలో ఉన్న చెడును తీసేసి, మంచిని కొనసాగిస్తూ హిందూ సమాజ రక్షణకు, భారతీయ విలువలను పెంపొందించేందుకు ‘లోక్ మంథన్’ వేదికగా అనేక అంశాలపై చర్చేందుకు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సమావేశం నిర్వహించడం అభినందనీయం.

భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయతత్వాన్ని మరింత బలోపేతం చేయడం మనందరి లక్ష్యం. విద్యావేత్తలు, ఆలోచనాపరులు, తత్వవేత్తలు, పరిశోధకులు, కళాకారులు ఇలా అనుభవజ్ఝులైన మేధావి వర్గమంతా ఒకే వేదికపై వచ్చి తమ ఆలోచనలు పంచుకునేందుకు ‘లోక్‌మంథన్’ ఒక వేదిక కావడం గొప్ప విషయం. అందులో భాగంగా కుటుంబ విలువలు, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, భారతీయ జీవన విధానం, పౌరుల క్రమశిక్షణ వంటి వాటిపై ‘లోక్‌మంథన్’ ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ… చర్చలు, సమ్మేళనాలు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్స్ వంటి వాటిని నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది.

వలస పాలకులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు భారతీయ సమాజంలో విభజనలు తీసుకొచ్చి పాశ్చాత్య భావజాలాన్ని మన మనస్సులో రుద్దితే.. ఆ విదేశీ భావజాలాన్ని తొలగించి భారతీయులంతా ఒక్కటే అని చాటిచెప్పేందుకు ఏర్పడ్డ వేదిక లోక్ మంథన్. నేషన్ ఫస్ట్ అని చాటి చెప్పడమే కాకుండా ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టి భారతీయ సమాజంలోని విభజనలను రూపుమాపి… ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రజ్ఝాభారతి చేస్తున్న క్రుషి లోమరువలేనిది. విభజనవాదాన్ని కొన్ని విద్యాసంస్థలు, మీడియా, సినిమా, రాజకీయ పార్టీలు చేసే ప్రచారాన్ని తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ….. భారతీయ సంస్క్రతి, సంప్రాదాయలను ఒకే వేదికపై ఆవిష్కరించేందుకు 3 దశాబ్దాలుగా ప్రజ్ఝాభారతి పాటుపడుతోంది.

భారతదేశం సనాతన ధర్మానికి కేంద్రమని… ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారికీ భారతదేశమే ఆధారం. జాతీయవాదంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, జాతీయవాదులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకునేందుకు ప్రజ్ఞా భారతి ఒక వేదికగా ఉంటూ వస్తోంది. జాతీయవాదాన్ని పెంపొందించేందుకు ప్రజ్ఞా భారతి రౌండ్ టేబుల్ సమావేశాలు, గ్రూప్ డిస్కషన్లు, సెమినార్లు, వెబినార్లు, మేధోమథన సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండటం గొప్ప విషయం.

అందులో భాగంగా నవంబర్ 21 నుండి 24 వరకు భాగ్యనగర్ లోని హైటెక్ సిటీ శిల్పకళావేధికలో బుర్రకథ, జాతరలు, జానపదాలు వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ‘లోక్ మంథన్’ నిర్ణయించడం సంతోషంగా ఉంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ను ఈరోజు ఆవిష్కరించే కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ఎంతో మంది మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మార్గదర్శకత్వంలో లోక్ మంథన్ నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • breaking news
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions