భువనగిరి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో శనివారం రాత్రి 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హాస్టల్ గదిలో మృతి చెందిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భువనగిరి పోలీసులు హాస్టల్ వార్డెన్ శైలజ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ప్రతిభ, ఆటోడ్రైవర్ ఆంజనేయులు, వంటవాళ్లు సుజాత, సులోచన, హాస్టల్ ట్యూషన్ టీచర్ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ చేయడంతో తమ కుమార్తెలు ఆత్మహత్యాయత్నానికి…
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను జనం ఈసడించుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు.. దాంతో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు.అయినా బుద్దిరాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోండి..సరిగా మాట్లాడండీ అని ఆయన హితవు పలికారు.…
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సన్నాసులు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు పండబెట్టి తొక్కుతారన్నారు. 4 కోట్ల మంది చెప్పుతో కొట్టినా బుద్దిరాలేదని, చెప్పులతోని కొట్టిన గాని బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. రెండు నెలలకే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది మీకు అని, ఫ్రస్టేషన్లో ఏది…
దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు ఛాయాలకు కేసీఆర్ కారణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హాంతకుడికి, పనికిరాని వ్యక్తి జగదీష్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి…
సీఎం రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని అంటున్నారని అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 వేల కోట్ల బడ్జెట్ తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని, ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. అయినా ఇప్పటి వరకు 1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర…
తాంసి మండలం చర్లపల్లి గ్రామం వద్ద సోమవారం టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో కండక్టర్తో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ సమీపంలోని వంపు వద్ద వాహనం తాబేలు కావడంతో ముగ్గురు ప్రయాణికులు, బస్సు కండక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప…
రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు…
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు టాలివుడ్ లో బిజీగా హీరోయిన్.. ఇప్పుడు మాత్రం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది.. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది.. ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిందో అప్పట్నుండి బాలీవుడ్లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ…
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు.