MLA Vasantha Krishna Prasad: పని చేస్తే వైసీపీ నుంచే పని చేస్తానని చెప్పా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Vasantha Krishna Prasad: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిన్నరగా ఇబ్బందులు పడుతున్న కారణంగా స్లో అయ్యానని ఆయన అన్నారు. మైలవరం ఇంఛార్జి ఇచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. తాను వర్గాలకు అతీతంగా పనిచేసి గ్రూపులను ప్రోత్సహించను అని చెప్పానన్నారు. పార్టీ మారేదు లేదు, పనిచేస్తే వైసీపీ నుంచే పని చేస్తా అన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.
Read Also: AP Assembly Sessions: ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
కానీ కొన్ని సంఘటనల వల్ల చాలా బాధ పడ్డానన్నారు. నియోజకవర్గంలో కొంత భాగానికి మాత్రమే ఎమ్మెల్యేగా ఉండాల్సి వచ్చిందన్నారు. మైలవరంలో గ్రూపులను ప్రోత్సహించారని.. వైసీపీ వాళ్ళే కొండపల్లి మున్సిపాలిటీని ఓడించారని ఆయన ఆరోపించారు. మైలవరంలో జరిగే అన్ని ఇబ్బందులను .. రాజకీయ ప్రత్యర్ధి కంటే సొంత పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నట్టు పార్టీ పెద్దలకు చెప్పానన్నారు. మైలవరంలో ఇబ్బందులను జగన్ సహా అందరికీ ఫిర్యాదు చేశానన్న ఆయన.. పెద్దిరెడ్డి తప్ప ఎవరూ కూడా ఈ విషయంలో స్పందించలేదన్నారు. సీఎం సమక్షంలో నియోజక వర్గ కేడర్ను తీసుకువెళ్తే కూడా అక్కడ క్లారిటీ ఇవ్వలేదన్నారు. 2014లో గెలవని, 2019లో నన్ను గెలిపించలేని వ్యక్తి నన్ను 2024లో గెలిపిస్తారని చెప్పటం బాధ కలిగించిందన్నారు. అందుకే తాను పార్టీలో నెమ్మదించానన్నారు. అభివృద్ది లేని సంక్షేమం వల్ల ఇబ్బందులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నియోజక వర్గంలో పనిచేసిన వారు బిల్లులు రాక రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కన్సల్టెన్సీతో వైసీపీ నడుస్తోందని.. అందువల్లే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తెలియటం లేదన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని తాను చెప్పానన్నారు. 2019 ఎన్నికల ముందే నేను రాజధాని గురించి జగన్ను అడిగితే ఆయన ఇదే రాజధాని అని చెప్పారని.. రాజధాని విషయంలో సెక్రటేరియట్ అమరావతిలో ఉంచాలని, అసెంబ్లీ విశాఖలో పెట్టాలని సీఎ జగన్కు సూచన చేశానన్నారు. తాను మొన్నటి వరకు రాజకీయాలకు స్వస్తి పలికి వ్యాపారం చేయాలని అనుకున్నానని.. తన శ్రేయోభిలాషులు మాత్రం రాజకీయాల్లో కొనసాగాలని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!