ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో తన ప్రభావం చూపుతోంది. ఈ రోజు ఉదయం చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటింది. అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్లపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. Also Read : నిండుకుండలా కళ్యాణి జలాశయం.. పొంగుతున్న చెరువులు ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో వరదనీటిలో నలుగురు…
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అంతేకాకుండా తక్షణ సహాయంగా రూ.1000 వెయ్యి చొప్పున సీఎం జగన్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. భారీ వర్షాలతో కళ్యాణి జలాశయం నిండుకుండాలా మారింది. పూర్తిస్థాయి…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో సైతం వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది.…
కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం ముంచుకొచ్చింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చైన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. Also Read : వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు మహిళలు ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం…
గ్రామ పంచాయతీ నిధులు ఓ ఎంపీటీసీ స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం చీలాపూర్ సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేశాడో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ. ఆ ఫోర్జరీ తో గ్రామపంచాయతీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.57,701 నగదును తన భార్య ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరికీ అనుమానం రాకుండా సదరు ఎంపీటీసీ ఆ ఖాతాను క్లోజ్ చేయించాడు. అయితే గత కొన్ని రోజులుగా గ్రామ…
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత సహా టీఆర్ఎస్ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్ఎస్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహాధర్నా ముగిశాక రాజ్భవన్కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్భవన్కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు. భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు…
ఏపీలో కాపుల జనాభా కోటి మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కాపు అభ్యర్థి ఉండాలని తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపి చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల లో కాపులు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, వారిలో చైతన్యం అవసరమని ఆయన అన్నారు. అంతేకాకుండా అన్ని పార్టీలను కలిసి కాపులను ముఖ్యమంత్రి చేయాలని కొరతానన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు…
ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అలరారుతోంది. కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ నెల 12 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 7వ రోజును పురస్కరించుకొని విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా తన ప్రవచనాలతో ఇటు యువతను, అటు పెద్దలను…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో…