Tamil Nadu: సామాన్యంగా గజం భూమిని కూడా ఫ్రీగా ఇచ్చే రోజులు కావు. భూమి అంటే గౌరవం.. తులం బంగారం పోయినా పర్వాలేదు కానీ, ఇంచు భూమి కోసం హత్యలు జరిగే కాలం ఇది. అయితే తమిళనాడులో ఓ మహిళ మాత్రం చేసిన పనిని చూస్తే నువ్వు త్యాగమూర్తివమ్మ అని అనకుండా ఉండలేదు. ఏకంగా కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వ పాఠశాల కోసం విరాళంగా ఇచ్చేసింది.