బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిలువరించాలనేది మా ప్రధాన ఎజెండా అన్నారు.
కక్కుర్తి పడి ఇక్కడ ఎవరు లేరన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కమ్యూనిస్టుల గురించి బీఆర్ఎస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కునంనేని అన్నారు. బీఆర్ఎస్ తో ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చ లేదన్నారు.
బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.