Kunamneni Sambasiva Rao: బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తాం.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao: బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిలువరించాలనేది మా ప్రధాన ఎజెండా అన్నారు. మంచైనా చెడైన కలిసే ఉండాలి అనేది మా ఉభయపార్టీల లక్ష్యమని తెలిపారు. మాకు గౌరవమున్న పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. బీఆఎస్, కాంగ్రెస్ కలిస్తే స్వాగతిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్ని పార్టీలు కలిసినా స్వాగతిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎం, సీపీఐ ఒకటే కత్తి… రెండు కత్తులు కావని అన్నారు. సీట్లు ముఖ్యం కాదు.. గౌరవం ముఖ్యమని తెలిపారు. అవసరమైతే పదవులు త్యాగం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా కూడా పోరాడేది మేమే.. ఇంకెవరన్న ప్రజల పక్షాన పోరాడుతున్నారా? అని ప్రశ్నించారు. కందాల, రేగా కాంతారావు, ఎవరి ఓట్లతో గెలిచారు? అదీ వారి విజ్ఞత, వారి మేధాశక్తికి హ్యాట్సాఫ్ అన్నారు. మీరు పాఠాలు చెప్తారా? మీరు ఎక్కడ గెలిచారు? ఇపుడు ఎక్కడున్నారు? ఎవర్ని ప్రశ్నిస్తున్నారు?నటించడం మాకు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఎం, సీపీఐ ఎప్పటికి అన్నదమ్ములమే అన్నారు. అన్న ఒకరు తమ్ముడు ఒకరు కాదన్నారు. ఇద్దరం ఒక తల్లి బిడ్డలమేఅని పేర్కొ్న్నారు. 40, 50 స్థానాలు ప్రభావితం చేస్తామ్ అది గెలుపైనా ఓటమైనా అని స్పష్టం చేశారు. 100 ఏళ్ళు మా పార్టీ బ్రతికి ఉందంటేనే మాకు ఒక లక్ష్యం ఉందన్నట్టు అని తెలిపారు. ఎన్ని స్థానాలు ఏంటని ఇంకా డిసైడ్ అవ్వలేదని అన్నారు.
Read also: Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్ నాశనం చేసేందుకు కుట్ర పన్నిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఉప వంటి చట్టాలను పెట్టాలని కునమునేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. ఈ లీకేజీ లో భాగస్వామ్యం వున్న అందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పదవ తరగతి , గ్రూప్ పరీక్షల్లో ఇటీవల కాలంలో లో పరీక్ష పత్రలు లీక్ అయ్యాయి. ఇదీ విద్యార్థులకు తీవ్ర నష్టం అని అన్నారు. పదవ తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారంలో.. బండి సంజయ్, పలువురికి జరిగిన చాట్ వ్యవహారంలో ఆధారాలు దొరికినట్లు గా వరంగల్ సి పి స్పష్టం చేశారన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం ఇలా లీక్ లు చేయడం దారుణమని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ బండి సంజయ్ పై మామూలు చట్టాలు పని చేయవని కఠినచర్యలు తీసుకోవాలని సాంబశివ రావు మండిపడ్డారు.
Bandi sanjay: ‘బండి’ అత్తగారింట్లో ‘బలగం’ సీన్ రిపీట్
తాజావార్తలు
-
RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
-
India-Iran: హార్ముజ్లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్ రాయబారికి సమన్లు
-
Zareen Khan: హద్దు దాటిన ఫోటోగ్రాఫర్.. ఇచ్చిపడేసిన హీరోయిన్! వీడియో వైరల్..
-
Kajal Aggarwal: కెరీర్లో బికినీ వేయకపోవడంపై కాజల్ సంచలన వ్యాఖ్యలు!
-
IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!