రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోమని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తాడు బొంగరం లేని వాల్లంతా పేపర్ లీక్ పై మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలతో తలసాని మాట్లాడుతూ.. అందరికీ పదవులు సాధ్యం కాదు.. ప్రభుత్వంలో పరిమిత సంఖ్యలో పదవులు ఉంటాయన్నారు.
ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర కు ఐదు రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఉగాది పండుగ, ఇతరత్రా కారణాలతో ఈనెల 25 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ వేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కాలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా రోడ్డు పై కాంగ్రెస్ నిరసన తెలిపారు.
వరుస ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల్లో భయాందోళన నెలకొందని తెలిపారు. సికింద్రాబాద్ లోనే వరుస ప్రమాదాలు జరగడం, ప్రాణ నష్టం జరగడం దురదృష్టకరమన్నారు.
ఆంధ్రావాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి పరామర్శించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతుండగా ఓ విలేకర్ మంత్రి ప్రసంగానికి అడ్డుపడటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు.