Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసు.. కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు. వర్చువల్ గా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు. 12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ రోజు మరో 71 వేల మందికి కేంద్ర ప్రభుత్వం లో సేవ చేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మన యువత ప్రపంచంని శాసిస్తుందని తెలిపారు. 2047 వరకు మన దేశం విశ్వగురువుగా ఎదగాలని అన్నారు. అమెరికా లాంటి దేశాలకు సెల్ పోన్ లు ఎగుమతి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంలో మంజూరు అయిన పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయమన్నారు. ఆగస్ట్ లోపల అన్ని ఖాళీల భర్తీ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
ఎందులో ముందుంది?
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అవినీతిలో, నియంతృత్వంలో, అహంకార కుటుంబ మాఫియా పాలనలో, అక్రమ లిక్కర్ కేసుల్లో ముందు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా మాట్లాడుతూ తొండి అట ఆడుతుందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు కూడా చేయాలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏంటో ప్రజలు తెలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఉట్టికి ఎగరనొడు ఆకాశానికి ఎగురుటనట్టు ఉంది.. విశాఖ స్టీల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు అంటూ ఎద్దేవ చేశారు. విశాఖ స్టీల్ ను సింగరేణి నుండి కొంటారు అట అని చురకలంటించారు. అదే సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయొద్దని ఆందోళన చేస్తారని మండిపడ్డారు. ప్రధాని వస్తె నిరసనలు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం దే అని చెప్పిన తప్పుడు ప్రచారం, నాటకాలు అడారని ఆరోపించారు. అబద్ధాలు, బురద జల్లడం అలవాటు అయిందని మండిపడ్డా్రు. ఏ సంస్థ పైన (మార్గదర్శి) అక్రమంగా దాడులు జరపొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 9 సంవత్సరాలు గా సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిపారు.
Traffic diversion: బీపీపీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు.. అటు పార్కులు, రెస్టారెంట్లు బంద్..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..