Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసు.. కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు. వర్చువల్ గా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు. 12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ రోజు మరో 71 వేల మందికి కేంద్ర ప్రభుత్వం లో సేవ చేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మన యువత ప్రపంచంని శాసిస్తుందని తెలిపారు. 2047 వరకు మన దేశం విశ్వగురువుగా ఎదగాలని అన్నారు. అమెరికా లాంటి దేశాలకు సెల్ పోన్ లు ఎగుమతి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంలో మంజూరు అయిన పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయమన్నారు. ఆగస్ట్ లోపల అన్ని ఖాళీల భర్తీ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
ఎందులో ముందుంది?
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అవినీతిలో, నియంతృత్వంలో, అహంకార కుటుంబ మాఫియా పాలనలో, అక్రమ లిక్కర్ కేసుల్లో ముందు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా మాట్లాడుతూ తొండి అట ఆడుతుందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు కూడా చేయాలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏంటో ప్రజలు తెలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఉట్టికి ఎగరనొడు ఆకాశానికి ఎగురుటనట్టు ఉంది.. విశాఖ స్టీల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు అంటూ ఎద్దేవ చేశారు. విశాఖ స్టీల్ ను సింగరేణి నుండి కొంటారు అట అని చురకలంటించారు. అదే సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయొద్దని ఆందోళన చేస్తారని మండిపడ్డారు. ప్రధాని వస్తె నిరసనలు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం దే అని చెప్పిన తప్పుడు ప్రచారం, నాటకాలు అడారని ఆరోపించారు. అబద్ధాలు, బురద జల్లడం అలవాటు అయిందని మండిపడ్డా్రు. ఏ సంస్థ పైన (మార్గదర్శి) అక్రమంగా దాడులు జరపొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 9 సంవత్సరాలు గా సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిపారు.
Traffic diversion: బీపీపీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు.. అటు పార్కులు, రెస్టారెంట్లు బంద్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!