Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసు.. కేటీఆర్ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan reddy: తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన దేశ వ్యాప్తంగా 71 వేల మందికి ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారని తెలిపారు. వర్చువల్ గా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు. 12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ రోజు మరో 71 వేల మందికి కేంద్ర ప్రభుత్వం లో సేవ చేసే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. మన యువత ప్రపంచంని శాసిస్తుందని తెలిపారు. 2047 వరకు మన దేశం విశ్వగురువుగా ఎదగాలని అన్నారు. అమెరికా లాంటి దేశాలకు సెల్ పోన్ లు ఎగుమతి చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంలో మంజూరు అయిన పోస్ట్ లను భర్తీ చేయాలని నిర్ణయమన్నారు. ఆగస్ట్ లోపల అన్ని ఖాళీల భర్తీ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
ఎందులో ముందుంది?
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ ట్వీట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అవినీతిలో, నియంతృత్వంలో, అహంకార కుటుంబ మాఫియా పాలనలో, అక్రమ లిక్కర్ కేసుల్లో ముందు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా మాట్లాడుతూ తొండి అట ఆడుతుందని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు కూడా చేయాలేని అసమర్ధ ప్రభుత్వం ఇది అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఏంటో ప్రజలు తెలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఉట్టికి ఎగరనొడు ఆకాశానికి ఎగురుటనట్టు ఉంది.. విశాఖ స్టీల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు అంటూ ఎద్దేవ చేశారు. విశాఖ స్టీల్ ను సింగరేణి నుండి కొంటారు అట అని చురకలంటించారు. అదే సింగరేణి నీ ప్రైవేట్ పరం చేయొద్దని ఆందోళన చేస్తారని మండిపడ్డారు. ప్రధాని వస్తె నిరసనలు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం దే అని చెప్పిన తప్పుడు ప్రచారం, నాటకాలు అడారని ఆరోపించారు. అబద్ధాలు, బురద జల్లడం అలవాటు అయిందని మండిపడ్డా్రు. ఏ సంస్థ పైన (మార్గదర్శి) అక్రమంగా దాడులు జరపొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 9 సంవత్సరాలు గా సెక్రటేరియట్ కు రాని ముఖ్యమంత్రులు ఉన్నారని తెలిపారు.
Traffic diversion: బీపీపీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు.. అటు పార్కులు, రెస్టారెంట్లు బంద్..
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!