ఆనందయ్య ఆయుర్వేద మందు.. అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు చర్చ మొత్తం కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందుపైనే.. కరోనా రోగుల నమ్మకం, విశ్వాసం ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందన్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామన్న ఆయన.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం ఆయుష్ బృందం కృష్ణపట్నం వెళ్తుందని చెప్పారు. ఇక, ఇప్పటికే ఏపీ ఆయుష్ కమిషనర్ కృష్ణపట్నం వెళ్లిన విషయాన్ని వెల్లడించిన సింఘాల్.. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనంలో ఆనందయ్య ఆయుర్వేదం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదనే చెబుతున్నారని తెలిపారు.. హానికారకాలు ఉన్నట్టు తేలలేదని.. అయితే, శాస్త్రీయపరంగా మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీ ఏ విధంగా చేస్తున్నారనేది రేపు డిమానిస్ట్రేషన్ చేయబోతున్నారన్న ఆయన.. కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు వినియోగం.. కరోనా కేసుల నమోదుపై కూడా అధ్యయనం జరుగుతుందన్నారు.
మరోవైపు. ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు సింఘాల్.. ఆక్సిజన్ సరఫరా 600 మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నామన్న ఆయన.. కాల్ సెంటరుకు వచ్చే కాల్స్ చాలా వరకు తగ్గాయన్నారు.. కరోనా చికిత్స మెరుగ్గా ఉండడం వల్ల కాల్స్ తక్కువగా వస్తున్నాయని భావిస్తున్నామన్న ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 77 శాతం మంది కరోనా రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు వెల్లడించారు.. ఆక్సిజన్ సరఫరాను పెంచుకునేలా చర్యలు చేపట్టామని.. 52 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న 9 పీఎస్ఏ ప్లాంట్లను పునరుద్దరించామని చెప్పుకొచ్చారు.. ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పరిశ్రమల శాఖ పాలసీ తీసుకురానుందని.. ఆక్సిజన్ ఉత్పత్తి సంస్థలకు ప్రొత్సాహాకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.. ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటి వరకు 32 నమోదయ్యాయి.. బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన ఇంజెక్షన్లు 800 వయల్స్ ఏపీకి వచ్చాయని.. మొత్తంగా 16650 వయల్స్ కోసం ఆర్డర్ పెట్టామని.. డీఆర్డీఏ 2డీజీ మెడిసిన్ కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు అనిల్ కుమార్ సింఘాల్..
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
తాజావార్తలు
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!