Minister Puvvada Ajay: రేపు ఖమ్మంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పర్యటిస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పర్యటన ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు నియోజక వర్గాలలో ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రుల పర్యాటనలు జరుగనున్నట్లు ఆయన ప్రకటించారు. గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం చేయనున్నారు. 1350 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి పువ్వాడ తెలిపారు. ఎన్టీఆర్ పార్క్, అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి శంకుస్థాపన చేయనున్నట్లు పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Nara Lokesh: నారా లోకేష్కు హైకోర్టులో ఊరట..
Also Read
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- Kavitha Arrest: కవిత నిరాహార దీక్ష భగ్నం.. మరో 33 మందిపై కేసు.!
- Telangana : పదేళ్ల తర్వాత మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా రెపరెపలు
త్రీ టౌన్ పరిధిలోని గోళ్లపాడు ఛానల్ మీద ఏర్పాటు చేసిన పది పార్క్ లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభిస్తారు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. మున్నేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీగల బ్రిడ్జికి శంకుస్థాపన ఉంటుంది.. అలాగే వీడీఓస్ కాలనీలో వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రగతి నివేదిన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం , కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతిపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. భద్రాచలంలో గోదావరి కరకట్టకు 38 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు కూనవరం రోడ్డులో శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
Read Also: Dengue Fever In Telugu: Dengue Fever: డెంగ్యూ జ్వరం.. తగ్గించే ఇంటి చిట్కాలు..
ఇక, అంబేద్కర్ సెంటర్ లో సెంట్రల్ లైటింగ్.. మీడియా సమావేశం.. మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లికి చేరుకొని బహిరంగ సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనపై ప్రసంగించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటిఆర్ గత ఆరు సంవత్సరాలుగా వందల కోట్లు నిధులు తీసుకుని ఖమ్మం వచ్చారు.. అభివృద్ధికి నిధులు ఇచ్చారు.. ప్రజలకు అండదండలు ఇచ్చారు అని ఆయన చెప్పారు. గతంలో అభివృద్ధి సాధ్యమైందా లేదా అనే ఆలోచన చేయాలి.. అసెంబ్లీ వేదికగా ఖమ్మం అభివృద్ధిపై చర్చించారు.. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చి అభివృద్ధిని చూసి వెళ్లారు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!