Minister Puvvada Ajay: రేపు ఖమ్మంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పర్యటిస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పర్యటన ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు నియోజక వర్గాలలో ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రుల పర్యాటనలు జరుగనున్నట్లు ఆయన ప్రకటించారు. గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం చేయనున్నారు. 1350 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి పువ్వాడ తెలిపారు. ఎన్టీఆర్ పార్క్, అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి శంకుస్థాపన చేయనున్నట్లు పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Nara Lokesh: నారా లోకేష్కు హైకోర్టులో ఊరట..
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
- Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
త్రీ టౌన్ పరిధిలోని గోళ్లపాడు ఛానల్ మీద ఏర్పాటు చేసిన పది పార్క్ లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభిస్తారు అంటూ మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. మున్నేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీగల బ్రిడ్జికి శంకుస్థాపన ఉంటుంది.. అలాగే వీడీఓస్ కాలనీలో వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రగతి నివేదిన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మం , కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతిపై డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. భద్రాచలంలో గోదావరి కరకట్టకు 38 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు కూనవరం రోడ్డులో శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
Read Also: Dengue Fever In Telugu: Dengue Fever: డెంగ్యూ జ్వరం.. తగ్గించే ఇంటి చిట్కాలు..
ఇక, అంబేద్కర్ సెంటర్ లో సెంట్రల్ లైటింగ్.. మీడియా సమావేశం.. మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లికి చేరుకొని బహిరంగ సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనపై ప్రసంగించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేటిఆర్ గత ఆరు సంవత్సరాలుగా వందల కోట్లు నిధులు తీసుకుని ఖమ్మం వచ్చారు.. అభివృద్ధికి నిధులు ఇచ్చారు.. ప్రజలకు అండదండలు ఇచ్చారు అని ఆయన చెప్పారు. గతంలో అభివృద్ధి సాధ్యమైందా లేదా అనే ఆలోచన చేయాలి.. అసెంబ్లీ వేదికగా ఖమ్మం అభివృద్ధిపై చర్చించారు.. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చి అభివృద్ధిని చూసి వెళ్లారు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!