కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
Kerala: గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ని నమ్మిపోతే ఇద్దరు యువ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు నదిలో మునిగిపోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. కొల్లాంకు చెందిన డాక్టర్ అద్వైత్(29), త్రిసూర్కి చెందిన డాక్టర్ అజ్మల్(29) జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో విధులు ముగించుకుని కొడుంగల్లూరు నుంచి ఇళ్లకు బయలుదేరారు. వీరితో పాటు మరో ముగ్గరు డాక్టర్లు తబ్సిర్, తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా ఉన్నారు.
కేరళ రైలు దహనం కేసులో నిందితుడిపై ఎన్ఐఏ (NIA) ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. నిందితుడు షారుక్ సైఫీ.. రాడికల్ వీడియోలు చూసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. అంతేకాకుండా.. చార్జిషీట్లో పలు విషయాలను వెల్లడించింది.
క్రికెట్ వరల్డ్ కప్ కు సర్వం సిద్దమయ్యింది. అన్ని దేశాల తమ జట్లను కూడా ప్రకటించాయి. అసలైన సమరానికి ముందు వార్మప్ మ్యాచ్ లకు కూడా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వివిధ జట్లు భారత్ చేరకున్నాయి. మొన్న పాక్ జట్టు హైదరాబాద్ చేరుకోగా తాజాగా రెండు వార్మప్ మ్యాచ్లు ఆడేందుకు కేరళ వెళ్లింది ఆస్ట్రేలియా క్రికెటర్ల టీం. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తన తొలి వార్మప్ మ్యాచ్ లో భాగంగా నెదర్లాండ్స్తో తలపడనుంది.…
డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. అనుమానిత డ్రగ్ డీలర్ ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి.
Lottery Ticket: లాటరీ టికెట్లు అంటే ఇండియాలో ముందుగా గుర్తుకువచ్చేది కేరళ రాష్ట్రమే. ఆ రాష్ట్రంలో లాటరీ టికెట్ల బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. కేరళ లాటరీలు అక్కడి సాధారణ ప్రజల్ని కూడా కోటీశ్వరులను చేసిన సంఘటను ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఈ లాటరీ టికెట్లే హత్యలకు దారి తీస్తున్నాయి. కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి.
Coconut Diet: ఎవరికైనా రోజు ఒకే ఆహారం తింటే బోర్ కొడుతుంది. ఆఖరికి చికెన్ బిర్యాని లాంటివి అయినా సరే కొద్ది రోజులు తినగానే ఇంకా తినాలి అనిపించద్దు. రోజుకొక కొత్త వెరైటీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా రోజూ వేరు వేరుగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 28 ఏళ్లుగా ఒకే ఆహారాన్ని ప్రతి రోజూ తింటున్నాడు. దీనికి కారణం అతడి అనారోగ్యం. కేరళలోని కాసరగోడ్కు…
Man who Returned from Kerala to Bengal Admitted to Hospital with Nipah Symptoms: కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పొట్టకూటి కోసం కేరళ వెళ్లి సొంత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ కు తిరిగివచ్చిన ఓ యువకుడిలో నిఫా వైరస్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో కలకలం…
కేరళలో తాజా నిఫా వైరస్ వ్యాప్తికి సంబంధించి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, హైరిస్క్ కాంటాక్ట్ల నుంచి 200 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం కేరళలో తెలిపారు. ఇప్పటివరకు 1,233 కాంటాక్టులను గుర్తించామని, అందులో అధిక రిస్క్, తక్కువ రిస్క్ కాంటాక్టులుగా వర్గీకరించామని చెప్పారు.