Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Brain Eating Amoeba Deaths Kerala Symptoms Prevention

Brain-Eating Amoeba: ‘‘మెదడు తినే అమీబా’’ కేరళలో 19 మందిని చంపేసింది.. ఇది ఎలా వ్యాపిస్తుంది, అడ్డుకోవడం ఎలా..?

Published Date :September 17, 2025 , 6:39 pm
By Venu Goapl Reddy
  • కేరళను వణికిస్తున్న ‘‘మెదడును తినే అమీబా’’..
  • ఈ ఏడాది ఇప్పటికే 19 మంది మృతి..
  • వెచ్చని, నిలిచిన నీటిలో ఉండే అమీబా..
  • ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు, చికిత్స, నివారణ..
Brain-Eating Amoeba: ‘‘మెదడు తినే అమీబా’’ కేరళలో 19 మందిని చంపేసింది.. ఇది ఎలా వ్యాపిస్తుంది, అడ్డుకోవడం ఎలా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Brain-Eating Amoeba: కేరళను ‘‘మెదడును తినే అమీబా’’ కలవరపెడుతోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటస్(PAM) పిలువబడే ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు.ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తిలో మెదడును ఈ అమీబా టార్గెట్ చేస్తుంది. ఈ ఏడాది కేరళలో 61 కేసుల్లో, 19 మంది మరణించారు. వీరిలో చాలా వరకు మరణాలు కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అన్నారంటే, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలేంటి ఈ ఇన్ఫెక్షన్.?

Also Read

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
  • PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
  • Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
Add as a preferred
source on google

PAM కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మెడదు కణజాలాన్ని నాశనం చేస్తుంది. చాలా సందర్భాల్లో తీవ్రమైన మెదడు వాపు, మరణానికి కారణమవుతుంది. ఇది వెచ్చని, నిలిచి ఉన్న నీటి నుంచి ఈ క్రిమి మానవశరీరంలోకి చేరుతుంది. ఇది ముక్కు ద్వారా మెదడును చేరి, ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఈ అమీబాలు ఉన్న చెరువుల్లో , నీటి కుంటల్లో ఈతకొట్టడం, డైవింగ్ చేయడం, స్నానం చేయడం ద్వారా సంక్రమించే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు నీటి ఉష్ణోగ్రతల్ని పెరగడం, ఈ వ్యాధితో ముడిపడి ఉంది.

లక్షణాలు:

PAM లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రధానంగా దీనిని నిర్ధారించడం కష్టం. దీని లక్షణాలు బ్యాక్టీరియల్ మెనింజైటిస్ వలే ఉంటాయి. తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి మెనింజైటిస్ లక్షణాలు ఉండటంతో డాక్టర్లు ఇదే వ్యాధి అనుకుని PAM నిర్ధారణ ఆలస్యం చేస్తుంటారు. దీంతో రోగిని మరణానికి కారణమయ్యే సెరిబ్రల్ ఎడెమా నుంచి రక్షించడం కష్టం అవుతుంది. లక్షణాలు క్రిమి సోకిన ఒకటి నుంచి 9 రోజుల మధ్య కనిపించవచ్చు. వాటి తీవ్రత ప్రారంభమైన గంటల నుంచి 1-2 రోజుల్లో మరణం సంభవించే అవకాశం ఉంటుంది.

చికిత్స ఏంటి..?

గత ఆరు దశాబ్ధాలలో ఈ వ్యాధి నుంచి బయటపడిన వారు ప్రి-సెరిబ్రల్ దశలో నిర్ధారణ జరిగిన వారే. రోగ నిర్ధారణ ఈ వ్యాధిలో అత్యంత కీలకం. ప్రారంభ దశలో నిర్ధారణ, యాంటీమైక్రోబయల్ కాక్టెయిల్ ను సకాలంలో రోగికి అందించడం ప్రారంభిస్తే, ప్రాణాలు కాపాడవచ్చు.

కేరళలో 2016లో తొలిసారిగా ‘‘మెదడును తినే అమీబా’’ వ్యాధిని గుర్తించారు. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, అది నిలువ ఉన్న కొలను, చెరువుల్లో స్నానాలకు, ఈతకు దూరంగా ఉండటం. నీటిలోకి ప్రవేశించే ముందు ప్రజలు ముక్కు క్లిప్ ధరించాలని సూచించారు. బావులు, చెరువుల్ని ఎప్పటికప్పుడు క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Brain Eating Amoeba
  • climate change health risk
  • disease prevention
  • health alert
  • Kerala

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్‌ రింగు రోడ్డు పనులు..!

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?

  • Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..

  • Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్‌లో ఉగ్రదాడి!

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions