కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత సహా టీఆర్ఎస్ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్ఎస్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహాధర్నా ముగిశాక రాజ్భవన్కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్భవన్కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో…
మొన్నటి వరకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ ఎమ్మెల్సీ పదవిని పొందారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద చేస్తోన్న మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని, రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని, అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ చాలా…
కేంద్ర ప్రభత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరితో రైతుల కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని, తెలంగాణలో…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహాధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలసిందే… ఈ నేపథ్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున్న టీఆర్ఎస్ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వాత రాజ్ భవన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందిరా పార్కు నుంచి పాదయాత్రగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు.. అయితే కేంద్ర ప్రభుత్వం…
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని… కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని… తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన కేసీఆర్ .. నేడు రైతుల పై రెండు…
గురుకుల పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని పలు గరుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కరోనా అనం తరం ప్రారంభమైనా పాఠశాలల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌలిదొడ్డిలోని సోషల్ వేల్ఫేర్ గురుకుల బాలికల, బాలుర పాఠశాలలను పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలోని తర గతి గదులు, హాస్టల్ భవనం, మెస్హాల్ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇతర సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్లో తీన్మార్ మోగిస్తుంది. కారు పార్టీ పుల్ జోష్ మీదుంది. ముగ్గురు నేతలను ఒకేసారి ఎంపిక చేయడం మంత్రి పదవులు సైతం దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైనా ఉమ్మడి వరం గల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కడి యం శ్రీహరి పేర్లను కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే.. రాజకీ య అనుభవం,…
కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసి 24 గంటలు గవక ముందే ఏం చేశాడని, ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తు న్నారని హనుమంతరావు కేసీఆర్ను ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంలో కేసీఆర్ ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ…
రాష్ర్టంలో తాను చేస్తున్న పర్యటనల్లో జరుగుతున్న ఘర్షణలపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. రైతుల కోసం రాళ్ల దాడులనైనా భరిస్తామన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకే వత్తాసు పలుకుతుం దన్నారు. రైతుల తో మాట్లాడుతుంటే రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని, 70మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు. దాడులు జరుగు తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులపై దాడులు జరిగినా స్పందించడం…