ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఓడించే అవసరం మాకు లేదని.. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నే శత్రువంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ని ఓడించే కార్యాచరణ తీసుకోవడం మాకేం అవసరం లేదన్నారు. మాకు మేమె శత్రువులమని వైస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
నా మాటలను వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాదు జిల్లా నరసింహులపేట మండలం వేదికలో నేను అలా చెప్పలేదని అన్నారు. ఆవార్తలపై స్పందించిన మంత్రి క్లారిటీ ఇచ్చారు.
లక్షీనరసింహ ఆలయానికి దర్శించుకునేందుకు నలుగురు సీఎంలు యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలోని ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు.
BRS పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు పక్క అని తెలంగాణ సీఎం కేసీఆర్ చెపుతూ వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ విషయంపై క్యాబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు నరసింహుల పేట మండలం వ్యాఖ్యలకు వేదిక అయింది.
తెలంగాణ సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు.