ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంచరాలు జరుగుతున్న వేళ బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు ఈటల రాజేందర్ సంచళన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదని ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేసీఆర్కు సీఈసీ అధికారికంగా లేఖ పంపింది. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ సంబరాలు మిన్నంటాయి. దీంతో ఈ సంబరాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి రానున్నారు.
ఎయిర్పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో కు నేడు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. అనంతరం మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కాం తో దోచుకుందని ఆరోపించారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పీడ్ పెంచారు.. మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. ఈ నెల 10వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, దళిత బంధు అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని…
కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ ల కుట్ర చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్టీవీతో చిట్ చాట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గంలోని ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీని రాయికోడ్ మండలంలోని సీరూర్ గ్రామంలో మాజీమంత్రి బాబూమోహన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
వైఎస్ఆర్ టీపీ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు.