Srinivas Goud: తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తున్నారని, 10 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోతామని, వైన్స్ షాప్ లలో రిజర్వేషన్లు దేశంలో ఎక్కడ లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు లోని మినీ స్టేడియం ప్రారంభోత్సవంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో అందరి జీవితాలలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలిస్తే వేదిక పైన ఉన్న పెద్దలు రాష్ట్రంలో 90% సీట్లు గెలిపిస్తారు అని పేర్కొన్నారు. ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి తెలిపాడు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలిపించాల్సిన అవసరం ఉంది అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క ఎకరాకైనా అదనంగా సాగు నీరు అందించారా అని ఆయన ప్రశ్నించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు ప్రెస్ మీట్ పెట్టారు. జీవన్ రెడ్డి దళిత బంధు పథకంపై మతిబ్రమించి, సంస్కరహీనంగా మాట్లాడారు అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు జీవన్ రెడ్డికి మెదడు లేదు అంటూ విమర్శించారు.
ఖమ్మ జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు ఇస్తున్నా.. అనే సాకు చూపించి అరకొర రైతుబంధు ఇచ్చి రైతులకు ఏదో మేలు చేస్తున్నాను అని చేప్తున్న కేసీఆర్ కి ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల కష్టాలు కనపడుతున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి తాము చేసే పాదయాత్రలకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్లినా అప్పటి కాంగ్రెస్ పాలను గుర్తు చేస్తుకుంటున్నారు అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు కాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని భట్టి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం అమలులో కొంతమంది ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి అని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
CM KCR: క్యాడర్ లో అసంతృప్తి లేకుండా చేయాలని, అవసరమైతే పార్టీ కార్యకర్తలు టీవీ ఛానల్ ను నడపాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోండని సూచించారు.