Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Cm Kcr Orders Lift Uapa Case Against Professor Haragopal

CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు ఎత్తేయండి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు

Published Date :June 17, 2023 , 12:31 pm
By NTV WebDesk
CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు ఎత్తేయండి.. డీజీపీకి  కేసీఆర్ ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM KCR: యూపీఏ చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంవో నుంచి తెలంగాణ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Read also: Stunning Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్న బ్రాడ్‌ కర్రీ

ములుగు జిల్లాలోని తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో 19 ఆగస్టు 2022న ఒక కేసు నమోదైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UPA), ఆయుధ చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. హరగోపాల్‌తో పాటు 152 మంది కార్యకర్తలు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..? పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని పోలీసులు రెండు నెలల కిందటే అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతనిపై మరిన్ని కేసులు ఉన్నాయని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టుకు సమాచారం అందించారు. అన్ని కేసుల వివరాలను పోలీసులకు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు నేతృత్వంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం, పార్టీకి నిధులు సమకూర్చడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలో చేర్చుకోవడం వంటి అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. నిందితుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ (ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే జస్టిస్ సురేశ్ మరణించారు), ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, సిక్దు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Read also: Kedarnath Disaster: కేదార్‌నాథ్ దుర్ఘటనకు పదేళ్లు.. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న ప్రజలు

మావోయిస్టు పార్టీకి చెందిన కొందరు సమావేశమవుతున్నారనే సమాచారంతో తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామంలో పోలీసులు ఉదయం కూంబింగ్ నిర్వహించారు. పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి విప్లవ సాహిత్యాన్ని, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దొరికిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని నిందితులుగా చేర్చారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హతమార్చేందుకు మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర పన్నారన్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు నేతృత్వంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం, పార్టీకి నిధులు సమకూర్చడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలో చేర్చుకోవడం వంటి అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. నిందితుల్లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ (ఎఫ్‌ఐఆర్ నమోదు కాకముందే జస్టిస్ సురేశ్ మృతి), ప్రొఫెసర్ పద్మా జాషా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, సుక్దు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు ఎత్తేయండి.. డీజీపీకి కేసీఆర్ ఆదేశాలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kcr
  • professor haragopal
  • telangana dgp
  • uapa act

తాజావార్తలు

  • Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

  • PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions