Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆరే చెబుతున్నారని.. ఆత్మాభిమానమున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని సూచించారు. ‘‘మహా జన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా ఈరోజు లక్సెట్టిపెటలో జరిగిన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రఘు, పాయల శంకర్, రాష్ట్ర కార్యదర్వి పల్లె గంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.
Read Also: Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాకి స్పెషల్ ఆఫర్లు.. రెండు రోజులు మాత్రమే, త్వరపడండి!
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
బీజేపీ మీటింగ్ ఉందంటే కేసీఆర్ సార్ పెగ్గులేసుకుని టీవీల ముందు కూసుంటడని బండి సంజయ్ విమర్శలు చేశారు. మంచిర్యాల ప్రజల్లో మస్త్ జోష్ కన్పిస్తోందని.. ఈ జోష్ ఇంకా 5 నెలలుండాలే… కేసీఆర్ అంతు చూద్దామన్నారు బండి సంజయ్. తెలంగాణ అంతటా తిరుగుతున్నానని.. టీఆర్ఎస్ మీటింగ్ లకు జనాలు ఎవరూ రావడం లేదని తెలిపారు. మోదీ పేద కుటుంబం నుండి వచ్చినోడు… పేదల కష్టాలు తెలిసినోడు. పీఎం కాగానే పేదల కష్టాలను తొలగించేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నడని బండి సంజయ్ అన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారని.. మరి కేసీఆర్ ఏం చేసిండని ప్రశ్నించారు.? లక్సెట్టిపేటలో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా? కొబ్బరికాయ కొట్టడానికే పరిమితమయ్యారు. మందు తాగుతూ మందిని ఎట్లా ముంచాలా? అని ఆలోచిస్తుంటడని ఆరోపించారు.
Read Also: Government Scheme : బాలికల చదువు కోసం ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో తెలుసా?
కేసీఆర్ రుణమాఫీ, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడు భూములకు పట్టాలు సహా అనేక హామీలిచ్చి మోసం చేశారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా తృప్తిగా లేదని.. అన్ని వర్గాల కోసం కొట్లాడే పార్టీ బీజేపీనని తెలిపారు. బీజేపీని కొట్టే దమ్ముకు బీఆర్ఎస్ కు లేదని.. అందుకే కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ వస్తున్నడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావడం లేదని.. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందని బండి సంజయ్ ఆరోపించారు.
- Tags
- bandi sanjay
- bjp
- BRS
- kcr
- modi
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!