MLC Kavitha : జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై కౌంటర్ దాడులకు దిగింది. అనంతరం పాకిస్తాన్ ప్రత్యక్షంగా భారత్పై దాడికి దిగడంతో, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్త వాతావరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం వల్ల కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సాంత్వనకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ…
MLC Kavitha : తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏర్పడినా.. సామాజికంగా సమానత్వం ఇంకా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం మే డే సందర్భంగా ఆమె నివాసంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కింద భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందుతోందని, కానీ భూమిలేని కార్మికుల విషయానికి వస్తే ప్రభుత్వం వైఫల్యం చెందిందని…
MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ…
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్ఎస్, కేటీఆర్ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర…
Balmoor Venkat : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తక్కువ కాలంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, గతంలో బీఆర్ఎస్ చేయని పనులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 56 వేల ఉద్యోగాలను భర్తీ చేయడమే దీన్ని ధ్రువీకరిస్తుందని తెలిపారు. ఇంటర్ పరీక్షల పేపర్ లీక్ నుంచి గ్రూప్-1 పరీక్షల లీక్ వరకు జరిగిన అనేక ఘటనలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని వెంకట్ ఆరోపించారు. మీ హయంలో…
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిర్చి దండలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని రూ. 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. Also Read:Ponnam Prabhakar:…
MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, చిన్న, పరిమితమైన కార్యక్రమాలను జరిపినా వాటిని మొదటి పేజీలో పెద్దగా ప్రచారం చేస్తూ చూపుతున్నందున, ఇతర కీలక విషయాలు పక్కనపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. ఆమె అభిప్రాయం ప్రకారం, రెండో దఫా కులగణనపై సరైన, సమగ్రమైన ప్రచారం జరపకపోవడం వల్ల, మొదటి దశలో గుర్తించబడిన, కూలాంటి కుటుంబాలు సర్వేకి తమ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాయని ఆమె అంటున్నారు. నాగర్కర్నూల్లో తెలంగాణ…
ఓపెన్ విత్ స్పాట్ సీఎం సీఎం నినాదాలు నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్కు వచ్చినప్పుడు చేసినవి ఇవే.... ఈ నినాదాలే..... ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చకు కారణం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఇదెక్కడి గోలరా...బాబూ... అంటూ పార్టీ పెద్దలే తలబాదుకుంటున్న పరిస్థితి. మామూలుగా అయితే... రాజకీయ నాయకులకు మీటింగ్స్లో ఇలాంటి నినాదాలు మాంఛి కిక్కు ఇస్తాయి. కానీ... బీఆర్ఎస్లో మాత్రం.... ఎవర్రా మీరు.... అసలెవర్రా మీరంతా.... అంటూ నినాదాలు చేస్తున్నవారిని కోపగించుకోవాల్సిన పరిస్థితి వస్తోందట.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘనపూర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. ‘అధికారం లేకపోవడంతో… బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. పదవి, అధికారం లేకుండా ప్రజలకు సేవ చేసే అలవాటు బిఆర్ఎస్ శ్రేణులకు లేదు అని మండిపడ్డారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. Also Read: Zee…