Sama Ram Mohan Reddy : కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే
- కవితను సస్పెండ్ చేయడానికి బీఆర్ఎస్ లో స్కెచ్
- కేసీఆర్ నిస్సహాయ స్థితిలో జయలలిత లాంటి దశలో ఉన్నారు
- కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ : రామ్మోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ కలిసి ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడో, రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
Also Read
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
- Sriman: "నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు".. నటుడు ఆవేదన!
- Crispy Jalebi Recipe: ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతం!
అంతేకాకుండా, సంతోష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ లు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం జయలలిత చివరి దశ లాగా తయారైందని, తన కుటుంబాన్ని చీల్చేస్తున్న దాడులపై ఆయన నిస్సహాయంగా మారిపోయారు అని రామ్మోహన్ విమర్శించారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె స్వంత పార్టీ పెట్టే అవకాశముందని వెల్లడించారు.
కవితతో సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని కేటీఆర్ కు ఆసక్తి లేదని తెలుస్తోందని, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే ఇప్పుడు కుటుంబాన్ని విభజిస్తున్నాయన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడితే గతంలో కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లే, ఇప్పుడు తనపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి.
కేసీఆర్ను ఎవరు కలవాలో, ఎవరు కలవకూడదో కూడా ఇప్పుడు సంతోష్ నిర్ణయిస్తున్నాడని, ఎమ్మెల్యేల నుంచి డబ్బులు తీసుకుని కేసీఆర్ దర్శనం కలిగిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి–బిడ్డల మధ్య ఈ అంతరాన్ని సృష్టించిందెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేటీఆర్, తమ పార్టీ లోపల జరిగే వివక్ష, కుట్రలపై ఎందుకు స్పందించడని రామ్మోహన్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చే ముందు, తమ పార్టీలో జరుగుతున్న భిన్నాభిప్రాయాలను చక్కదిద్దుకునే పనిలో కేటీఆర్ నిమగ్నమవ్వాలి అని హితవు పలికారు.
Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
తాజావార్తలు
-
UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో