Sama Ram Mohan Reddy : కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే
- కవితను సస్పెండ్ చేయడానికి బీఆర్ఎస్ లో స్కెచ్
- కేసీఆర్ నిస్సహాయ స్థితిలో జయలలిత లాంటి దశలో ఉన్నారు
- కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ : రామ్మోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ కలిసి ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడో, రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
Also Read
- Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ - భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్కు వర్షం ముప్పు..
- Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
అంతేకాకుండా, సంతోష్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్న యత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కవిత చెప్పిన దెయ్యాలు సంతోష్, కేటీఆర్, హరీష్ లు అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిస్థితి ప్రస్తుతం జయలలిత చివరి దశ లాగా తయారైందని, తన కుటుంబాన్ని చీల్చేస్తున్న దాడులపై ఆయన నిస్సహాయంగా మారిపోయారు అని రామ్మోహన్ విమర్శించారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, ఆమె స్వంత పార్టీ పెట్టే అవకాశముందని వెల్లడించారు.
కవితతో సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని కేటీఆర్ కు ఆసక్తి లేదని తెలుస్తోందని, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలే ఇప్పుడు కుటుంబాన్ని విభజిస్తున్నాయన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడితే గతంలో కేసీఆర్ చర్యలు తీసుకున్నట్లే, ఇప్పుడు తనపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు రామ్మోహన్ రెడ్డి.
కేసీఆర్ను ఎవరు కలవాలో, ఎవరు కలవకూడదో కూడా ఇప్పుడు సంతోష్ నిర్ణయిస్తున్నాడని, ఎమ్మెల్యేల నుంచి డబ్బులు తీసుకుని కేసీఆర్ దర్శనం కలిగిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని తీవ్రంగా మండిపడ్డారు. తండ్రి–బిడ్డల మధ్య ఈ అంతరాన్ని సృష్టించిందెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కేటీఆర్, తమ పార్టీ లోపల జరిగే వివక్ష, కుట్రలపై ఎందుకు స్పందించడని రామ్మోహన్ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చే ముందు, తమ పార్టీలో జరుగుతున్న భిన్నాభిప్రాయాలను చక్కదిద్దుకునే పనిలో కేటీఆర్ నిమగ్నమవ్వాలి అని హితవు పలికారు.
Perni Nani: కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
తాజావార్తలు
-
Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!
-
Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
-
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్కు వర్షం ముప్పు..
-
Sing-Geetham : ‘సింగ్-గీతమ్’ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
-
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!