మంత్రి లక్ష్యంగా ఆ జిల్లాలో బీజేపీ పావులు కదుపుతోందా? సీబీఐ గట్టిగానే ఉచ్చు బిగిస్తోందా? వందల కోట్ల స్కామ్ కావడంతో అంతా ఉలిక్కి పడుతున్నారా? మంత్రి విషయంలో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొందా? గ్రానైట్ కేసులో మంత్రి గంగుల ఇరుక్కున్నట్టేనా?ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 350కిపైగా గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికం రాజకీయ నేతలవే. వారిలో ఒకరు మంత్రి గంగుల కమలాకర్. ఆయన ఆధ్వర్యంలోనూ కొన్ని గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. 2012లో జరిగిన స్కామ్పై…
కరీంనగర్ జిల్లా రాజకీయం వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ పై ధ్వజమెత్తారు. రవీందర్ సింగ్ పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. రవీందర్ సింగ్ అవకాశవాద రాజకీయాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడన్నారు సునీల్ రావు. టీఆర్ఎస్కు రాజీనామా అంశం ఆయన నైతికతకే వదిలేస్తున్నాం. గత సంవత్సర కాలంగా 2023లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తా అన్నది నిజం కాదా? ఏ ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో అవకాశం కావాలి అనడం అత్యాశ.…