Karimnagar Politics : గోడ మీద పిల్లులకు ఇతర పార్టీల్లో కండువాలు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Politics : తెలంగాణలో ప్రస్తుతం జంపింగ్ జపాంగ్ల టైమ్ నడుస్తోంది. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కాస్త హింట్ ఇస్తే చాలు.. కండువా కప్పడానికి క్షణం ఆలోచించడం లేదు. ఈ విషయంలో బీజేపీ గేర్ మార్చినట్టు ఆ జిల్లాలో టాక్. బీజేపీ వలకు నేతలు చిక్కుతున్నారా? చిక్కుముళ్లు ఎదురవుతున్నాయా?
కరీంనగర్ జిల్లాలో అసమ్మతి నేతలు అంతా మూకుమ్మడిగా పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. అధికార టీఆర్ఎస్లో ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు.. కాంగ్రెస్లో అధిష్ఠానం వైఖరితో విసుగు చెంది మరికొందరు.. రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీవైపు ఆశగా చూస్తున్నారట. అలాంటి వారిపై కొంతకాలంగా జిల్లా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also Read
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Off The Record: ఇంటి దొంగలే దుష్ప్రచారం చేస్తున్నారా?.. మంచిర్యాల కాంగ్రెస్లో కొత్త మంటలు!
మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కొన్నాళ్లుగా టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన సంతోష్.. టీఆర్ఎస్లో చేరాక పక్కన పెట్టేశారని అనుచరులు గుర్రుగా ఉన్నారట. అందుకే బీజేపీలో అదృష్టాన్ని వెతుక్కోవాలని అనుకుంటున్నారట. మానకొండూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సైతం టీఆర్ఎస్లో టికెట్ రాదనే బెంగతో ఉన్నారట. ఆయన కూడా బీజేపీలోకి వెళ్లేందుకు అనుచరులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.
హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న బొమ్మ కుటుంబం సైతం పునరాలోచనలో పడిందట. ఇక్కడ కాంగ్రెస్ ఇంఛార్జ్గా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అభ్యంతరాలను కాదని.. మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రవీణ్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై సీన్ మారిపోయింది. పీసీసీ వైఖరిని తప్పుపడుతూ కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు శ్రీరామ్ చక్రవర్తి సిద్ధమయ్యారట. ఆయన బీజేపీ అధిష్ఠానంతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి కాంగ్రెస్లో వర్గపోరు ఎక్కువ కావడంతో ఓదెల జడ్పీటీసీ గంటా రాములు సైతం జంప్ కొట్టడానికి రెడీగా ఉన్నారట. బీసీ కోటాలో టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని కమలనాథులకు రాములు చెప్పారట.
ఉమ్మడి జిల్లాలో గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన కొందరు నాయకులు మాత్రం.. కొత్తవారి రాకను అడ్డుకుంటున్నారట. అక్కడ పీటముడి పడటంతో చేరికలు ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. కాకపోతే జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్తో నిత్యం టచ్లో ఉంటున్నట్టు చెబుతున్నారు. సమయం రాగానే గేట్లు తెరుస్తామని.. అంతా వచ్చేయొచ్చని భరోసా ఇస్తున్నారట. మరి.. ప్రచారంలో ఉన్న నాయకులు గోడ మీద కాచుకుని ఉంటారో.. లేక ఉన్నచోటే సర్దుకుపోతారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!