భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం…
భారీవర్షాలు, వరదలు చిత్తూరు జిల్లాను వణికిస్తున్నాయి. జిల్లాకు ఇవాళ,రేపు భారీవర్ష సూచన ఉందన్నారు కలెక్టర్ హరినారాయణ. ఈ ఏడాది జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని, ఇప్పటికే చెరువులు,డ్యాంలు పూర్తిగా నిండాయన్నారు. నదులు, వాగులు,నీటి ప్రవాహాలను దాటవదని, రేపు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా వుంచామని కలెక్టర్ హరి నారాయణ తెలిపారు.మరోవైపు తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది నీటి ప్రవాహం. దీంతో వాహనాల అనుమతిని నిలిపివేశారు అధికారులు.…