సునీతా కేజ్రీవాల్తో కల్పనా సోరెన్ భేటీ.. ఏ నిర్ణయం తీసుకున్నారంటే..! జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆమె… సునీతా కేజ్రీవాల్ను కలిశారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ, కేజ్రీవాల్ జైలు కెళ్లిన పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో…
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్త హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానాన్ని సోనియాకు వివరించారు.
కల్పనా సోరెన్.. తన భర్తను తలచుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ తన భర్త, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, ఇవాళ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భార్య కల్పనా సోరెన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది.
రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. రాహుల్తో భేటీ అయింది.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. కొత్త సీఎంగా చంపై సొరెన్ను జేఎంఎం శాసనసభాపక్షం ఎన్నుకుంది. చంపై సొరెన్ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన భార్య కల్పనా సోరెన్ సీఎం అవుతారంటూ వార్తలు హల్చల్ చేశాయి. హేమంత్ సోరెన్ కూడా కల్పనా వైపు మొగ్గు చూపారు. కానీ చివరికి ఆ ప్లాన్ రివర్స్ కొట్టింది. కూటమిలో విభేదాలు తలెత్తడంతో సడన్గా తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకోవడంతో త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు అందరూ లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రాంచీ రావాలని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారట. తాజా…