ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓవర్ స్పీడ్ పాలిటిక్స్ చేసినట్టు చెప్పుకుంటారు. ఆయన నోటికి కూడా హద్దూ అదుపూ ఉండేది కాదన్నది రాజకీయవర్గాల్లో విస్తృతాభిప్రాయం. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టార్గెట్గా తగ్గేదే లేదన్నట్టు చెలరేగిపోయేవారు. అబ్బే.... వాళ్ళకంత సీన్ లేదు, ఇంత సినిమా లేదంటూ మీసాలు మెలేసి సవాళ్ళు విసిరేవారాయన. కట్ చేస్తే.... రాష్ట్రంలో ప్రభుత్వం మారాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే.
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. Also Read:US: విదేశాలకు పంపే డబ్బుపై పన్ను.. ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు..…
Illegal Affair: వివాహేతర సంబంధాలు సంబంధించిన విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త స్వయంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. Read Also: iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!…
వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారాయన. కానీ... ఈసారి తాను గెలిచి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆయన వైఖరి కాస్త మారినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లో ఎక్కడా పార్టీ నాయకులు ఇన్వాల్వ్ కావద్దని చెబుతున్నారట ఎమ్మెల్యే.
AP 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది.
AB Venkateswara Rao: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కలిశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారణ చేయాలని కోరారు.
ఇద్దరి ఇష్టంతో జరిగితేనే అది పెళ్లి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా, తమ కూతురుకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని కొందరు తల్లిదండ్రులు వయసు ఎక్కువగా ఉన్నవారికిచ్చి పెళ్లిల్లు చేయడం ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవడం చూస్తు్న్నాం. ఈడుజోడు కలవాలి, అభిప్రాయాలు ఒక్కటవ్వాలి అనే విషయాలను పట్టించుకోకపోవడం వల్ల పెళ్లిల్లు పెటాకులు అవుతున్నాయి. ఈ క్రమంలో కాకినాడలో 23 ఏళ్ల యువతితో 42 ఏళ్ల వ్యక్తి పెళ్లికి సిద్ధమయ్యాడు. పోలీసుల…
రేషన్ బియ్యం పంపిణీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొందరు దుర్మార్గులు రేషన్ మీద ఇల్లీగల్గా సంపాదించి మన మీద పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.. వారికి మనమే అవకాశం ఇస్తున్నాం.. విజిలెన్స్ విచారణ, కేసులు వలన ఏంటి ఉపయోగం? అని నిలదీశారు..
ఆన్లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనం భారీన పడిన ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. భూమి కొందామని దాచిన కోటిన్నర డబ్బును ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ మాయలో పడి పోగొట్టాడు. డబ్బేదని కుటుంబ సభ్యులు అడగగా.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సదరు వ్యక్తి చివరకు ఆత్మహత్యే దిక్కనుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు…
రాజమండ్రిలోని ఓ ప్రేవేటు ఆస్పత్రిలో డెలివరీకి వెళ్ళిన గర్భిణి స్త్రీ అదృశ్యం కావడం కలకలం రేపింది. రాత్రి ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళిపోయింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి మొత్తం వెతికినా.. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆందోళన చెందిన వారు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మహిళను చివరకు కాకినాడ జీజీహెచ్లో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?…