JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
BJP Promises Uniform Civil Code In Himachal If Voted Back To Power: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఆదివారం రోజున పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మేనిఫేస్టోను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతామనే విషయాలను మేనిఫేస్టోలో వివరించారు. 11 హామీలను ఇచ్చారు. ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలోకి…
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బీజేపీ అవకాశం కల్పిస్తే లోక్సభ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.
బీజేపీకి గుడ్బై చెప్పి తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్.. ఈ మేరకు బీజేపీ జీతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు..
కాంగ్రెస్ మాజీ నేత విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.
వచ్చే నెల 1తో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మునుగోడు టూర్ ఖరారైంది. ఈ నెల 31 న మునుగోడులో ఏర్పాటు చేయనున్న ఉప ఎన్నిక ప్రచార సభకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు.
జేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 2016 లో ఇచ్చిన మీ హమీలు ఏమయ్యాయి? అంటూ ట్వీట్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా, మీరు పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని నడ్డా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు మరచారంటూ గుర్తు తెలియని వ్యక్తులు నడ్డాకు సమాధి కట్టారు. మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డిపై వెలసిన పోస్టర్లు కలకలం రేపగా.. ఇప్పుడు నడ్డాకు ఏకంగా సమాధికట్టిన తీరుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.